Breaking News

Chiranjeevi: మనసు కలచి వేసిందన్న చిరంజీవి.. సాయం చేయండంటూ బండ్ల గణేష్ రిక్వెస్ట్


భారీ వర్షాల దెబ్బకు తిరుపతి అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో వరణుడు కన్నెర్రజేశాడు. తిరుమల ఏడు కొండల పాయల్లోంచి నీరు నదిలా ప్రవహిస్తూ ఉగ్రరూపం దాల్చుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఘాటు రోడ్డును సైతం దెబ్బతింది. కొండచరియలు విరిగిపడుతన్నాయి. తిరుమల మాఢ వీధుల్లో నీరునింది ఉంది. దీంతో తిరుమలకు రాకపోకలు మూసివేశారు. ఈ వర్షాల వల్ల తిరుమల కొండ మీద భక్తులతో పాటుగా తిరుపతిలో ఉన్న ప్రజలు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నెలకొన్న పరిస్థితులపై మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. భారీ వర్షాల కారణంగా స్థానికులు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే మనసును కలచి వేస్తోందని అన్నారు. ''గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమల తిరుపతిలో భక్తులు స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనసును కలచివేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం టీటీడీలు సమష్టిగా కృషి చేసి సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పాలి. అన్ని రాజకీయ పక్షాలు అభిమాన సంఘాలు సైతం చేయూతనివ్వాల్సిందిగా కోరుతున్నాను'' అని చిరంజీవి పేర్కొన్నారు. అదేవిధంగా తిరుపతిలో వర్షం సృష్టిస్తున్న భీబత్సం పట్ల రియాక్ట్ అవుతూ.. ''సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు చేయగలిగిన ప్రతీ సాయం, చర్యలను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ, అన్ని రాజకీయ పార్టీలను, అభిమాన సంఘాలను కోరుతున్నా'' అని అన్నారు. ఇక సైతం తిరుపతి వరదలపై రియాక్ట్ అవుతూ.. భారీ వర్షాలతో తిరుపతి తిరుమలలో పరిస్థితులు అతలాకుతలంగా మారాయని చెబుతూ ఇప్పట్లో తిరుపతికి వెళ్లొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రకృతి ఉగ్రరూపం దాల్చింది. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి అని పేర్కొంటూ అక్కడి పరిస్థితులు తెలిసేలా ఓ వీడియో షేర్ చేశారు మంచు లక్ష్మి.


By November 20, 2021 at 10:16AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/chiranjeevi-bandla-ganesh-reactions-on-tirupathi-rains/articleshow/87812102.cms

No comments