Breaking News

By Elections 2021 బెంగాల్‌లో దీదీ హవా.. రెండు చోట్ల 1.40 లక్షలు దాటిన టీఎంసీ మెజార్టీ!


దేశవ్యాప్తంగా మూడు పార్లమెంట్ స్థానాలు, 29 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ, మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా, దాద్రా నగర్‌ హవేలీ ఎంపీ స్థానాలు, తెలంగాణలోని హుజూరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు సహా 13 రాష్ట్రాల్లోని 29 శాసనసభ స్థానాలకు అక్టోబరు 30న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. ఉప-ఎన్నికలు జరిగిన ఈ 29 అసెంబ్లీ స్థానాలకు 6, కాంగ్రెస్‌ 9 సిట్టింగ్ స్థానాలు. మిగతా చోట్ల ప్రాంతీయ పార్టీలు విజయం సాధించాయి. ఇక మండీ, ఖాంద్వా, దాద్రానగర్‌ హవేలీలో సిట్టింగ్‌ ఎంపీల మరణంతో అక్కడ ఎన్నికలు అనివార్యమయ్యాయి. మండీలో కాంగ్రెస్‌ సీనియర్ నేత వీరభద్ర సింగ్ మరణంతో అక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి, వీరభద్ర సింగ్ సతీమణి ప్రతిభా సింగ్‌ ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ నుంచి బ్రిగేడర్‌ కుషాల్‌ సింగ్‌‌పై ఆమె 10వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎంపీ మోహన్ దేల్కర్ ఆత్మహత్యకు పాల్పడటంతో దాద్రా నగర్‌ హవేలీకి ఉప- ఎన్నిక జరిగింది. ఇక్కడ శివసేన అభ్యర్థిగా పోటీచేసిన మోహన్‌ భార్య కలాబెన్‌ దేల్కర్‌ ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి మహేశ్ దోదీ, బీజేపీ నుంచి మహేశ్‌ గవిత్‌ బరిలోకి దిగారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి జ్ఞానేశ్వర్‌ పాటిల్‌ సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి రాజనారాయణ్‌ సింగ్‌ పూర్ణిపై 30వేలకుపైగా ఓట్ల ముందంజలో కొనసాగుతున్నారు. ఇక, పశ్చిమ బెంగాల్‌లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. నాలుగింట అధికార తృణమూల్ కాంగ్రెస్‌ అభ్యర్థులు భారీ ఆధిక్యంలో ఉన్నారు. దినహతాలో నుంచి పోటీచేసిన ఉదయన్ గుహ.. సమీప ప్రత్యర్ధి బీజేపీ నేత అశోక్ మండల్‌పై 1.31 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉండగా.. గోసాబాలో టీఎంసీ అభ్యర్థి సుబ్రతా మండల్.. బీజేపీ అభ్యర్థి పలాశ్ రానాపై లక్షా 41 వేలకుపైగా ఓట్ల భారీ మెజార్టీలో ఉన్నారు. * అస్సాంలో ఐదు అసెంబ్లీ స్థానాల్లో మూడు చోట్ల బీజేపీ, రెండు చోట్ల యూపీపీఎల్ ముందంజలో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని మూడు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ రెండు, కాంగ్రెస్ ఒకచోట ఆధిక్యంలో కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మూడు స్థానాలు.. రాజస్థాన్‌లోని రెండు స్థానాల్లో కాంగ్రెస్ లీడ్‌లో ఉంది. కర్ణాటకలో రెండు చోట్ల ఉప-ఎన్నిక జరగ్గా.. కాంగ్రెస్, బీజేపీలు చెరో స్థానంలో ఆధిక్యత ప్రదర్శిస్తున్నాయి. బిహార్‌లో రెండు స్థానాలకు.. జేడీయూ, ఆర్జేడీలు ఒక్కో చోట, మహారాష్ట్రలో ఒక్క స్థానానికి ఎన్నిక జరగ్గా కాంగ్రెస్ ముందజలో ఉన్నాయి.


By November 02, 2021 at 01:29PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/counting-underway-in-3-mp-and-29-assembly-by-elections-tmc-massive-win-in-bengal/articleshow/87483189.cms

No comments