విషాదం.. పబ్జీ ఆడుతూ రైలు కిందపడి ఇద్దరు బాలురు మృతి
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
![](https://telugu.samayam.com/photo/87840587/photo-87840587.jpg)
ఇద్దరు బాలురు ఆడుతూ ప్రాణాలు పోగొట్టుకున్న విషాదకర ఘటన ఉత్తర్ ప్రదేశ్లో చోటుచేసుకుంది. ఆదివారం ఇంటి నుంచి బయటకొచ్చిన ఇద్దరూ మొబైల్ ఫోన్లో పబ్జీ గేమ్ ఆడుకుంటూ ఎదురుగా వస్తున్న రైలు కిందపడిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మథురలోని లక్ష్మీ నగర్కు చెందిన కపిల్ (18), రాహుల్ (16) పదో తరగతి చదువుతున్నారు. ఇద్దరూ ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. పబ్జీ ఆడుకుంటూ రైలు పట్టాలకు సమీపంగా వెళ్లిన విషయాన్ని గమనించలేదు. పబ్జీలో లీనమైపోయిన కపిల్, రాహుల్ రైలు రూపంలో ప్రమాదం ముంచుకొస్తున్నా పట్టించుకోలేదు. దీంతో ఇరువురి రైలు కింద నలిగిపోయారు. వారి మొబైల్ ఫోన్లు ప్రమాద స్థలిలో గుర్తించారు. ప్రమాద తీవ్రతకు ఒక ఫోన్ ధ్వంసం కాగా.. మరో మొబైల్లో పబ్జీ గేమ్ రన్నింగ్లో ఉందని పోలీసు అధికారులు తెలిపారు. మథుర కంటోన్మెంట్, రాయ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం తరలించారు. పబ్జీ గేమ్కు బానిసలుగా మారి పదుల సంఖ్యలో పిల్లలు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. గేమ్ ఆడి పలువురు అప్పులపాలవుతున్నారు. వీటిని ఎలా తీర్చాలో తెలియక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాగే, ప్రమాదకరమైన ఈ ఆటను అడొద్దని తల్లిదండ్రులు చెప్పినా కొందరు క్షణికావేశంతో ప్రాణాలు తీసుకుంటున్నారు.
By November 22, 2021 at 09:20AM
No comments