Breaking News

నిద్ర లేవగానే అది చూసి షాకైన పూజా హెగ్డే.. బెడ్ మీదే! కారణం అదేనా..?


బుట్టబొమ్మ నిద్ర లేవగానే తన ఫోన్ చూసుకొని షాకైంది. ఆ వెంటనే తెగ సంబర పడుతూ బెడ్ మీదనే డాన్స్ కూడా వేసేసింది. అంతేకాదు ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ అసలు విషయాన్ని చెప్పేసింది. అదేనండీ.. ఫేస్ బుక్, ఇన్స్‌స్టా, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఎంతమంది ఫాలోవర్స్ పెరిగితే అంత సంతోషపడే రోజులివి. ఈ రోజుల్లో సెలబ్రిటీలు సైతం దానికే ప్రియార్టీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తన ఇన్స్‌స్టా ఫాలోవర్స్ 16 మిలియన్స్ దాటారని తెలిసి షాకైంది పూజా. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పూజా హెగ్డే హవా సాగుతోంది. బికినీ ఫోటోషూట్స్, వీడియోలతో పిచ్చెక్కిస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అండ్ హాట్ లుక్స్ పోస్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. ఇటీవల మాల్దీవుల విహారం గురించి అయితే ప్రత్యేకమైన వివరణ అవసరమే లేదు. ఇదే బాటలో ఇప్పుడు మరో వీడియోతో ఆకట్టుకుంది పూజా. బెడ్ మీద పడుకొని నిద్ర లేస్తూ లేస్తూనే తన ఇన్స్‌స్టా ఫాలోవర్స్ 16 మిలియన్స్ దాటారని చూసి షాక్ కావడంతో పాటు సంబరపడింది. ఈ మేరకు మీ అందరి అభిమానం ఇంకా ఎంకరేజ్ చేస్తోందని, రాబోయే రోజుల్లో మరింతగా ఎంటర్‌టైన్ చేస్తానని పేర్కొంది పూజా హెగ్డే. అయితే గతంతో పోల్చితే ఇటీవల మాల్దీవ్స్ ట్రిప్ వేశాక పూజా ఫాలోవర్స్ మరింతగా పెరిగారు. అక్కడి నుంచి ఆమె షేర్ చేసిన హాట్ ఫొటోస్, వీడియోస్ ఇందుకు కారణం అని చెప్పుకోవచ్చు. ఇక పూజా హెగ్డే సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీతో సక్సెస్ అందుకొని వరుసపెట్టి బడా ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టింది. ప్రభాస్ సరసన 'రాధే శ్యామ్' సినిమాలో నటిస్తూనే రామ్ చరణ్ సరసన 'ఆచార్య' సినిమాలో భాగమవుతోంది. ఈ రెండు సినిమాల్లో పూజా క్యారెక్టర్ చాలా కీలకం కానుందని సమాచారం.


By November 23, 2021 at 07:15AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/heroine-pooja-hegde-shocked-when-she-was-wake-up/articleshow/87859369.cms

No comments