Breaking News

బాధను పోగొట్టే శక్తి ఉందా?.. సమంత దారిలో రెజీనా


సమంత ఆ మధ్య ఓ సారి ఆర్ట్, పెయింటింగ్ అంటూ కొన్ని విషయాలు చెప్పింది. కరోనా వల్ల ఎంతో బాధింపబడ్డారు.. ఎంతో మంది ఎన్నో రకాలుగా కష్టాలుపడ్డారు.. ఎంతో మందికి జీవితం మీద హోప్స్ కోల్పోయారు. అలాంటి వారిలో మళ్లీ ఆత్మ స్థైర్యాన్ని నింపేందుకు ఇలా పెయింటింగ్, ఆర్ట్ వంటి ప్రోగ్రాంను ప్రారంభించారంటూ సమంత చెప్పుకొచ్చింది. పెయింటింగ్, ఆర్ట్ గురించి చెబుతూ చిన్నతనంలోనూ తనను ఎవరైనా ఏదైనా చేయలేరు అని చెబితే వెంటనే చేసి చూపెట్టేదాన్ని, అలా బాల్యం పెయింటింగ్ వేశానంటూ సమంత చెప్పుకొచ్చింది శ్రిష్టి ఆర్ట్ సంస్థ నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో మనోహర్ చిలువేరు ముందుండి నడిపిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు లక్ష్మీ నంబియార్ సెలెబ్రిటీలను తీసుకెళ్లున్నట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పటికే సమంత ఆ ఈవెంట్‌కు వెళ్లింది. తనకు నచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా పెయింటింగ్ వేసింది. అయితే ఆ తరువాత మంచు లక్ష్మీ సైతం వచ్చింది. తన కూతురు విద్యతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేసింది. అయితే ఇప్పుడు వంతు వచ్చినట్టుంది. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు అంటే రెజీనా ముందుంటుందన్న సంగతి తెలిసిందే. ఆర్ట్‌కు బాధలను పోగొట్టే శక్తి ఉంటే.. ఆర్టిస్ట్ బాధలను పోగొట్టే నిపుణులు అవుతారు. అందరినీ కలిసికట్టుగా ఉంచేందుకు మనోహర్ చిలువేరు ఈ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. శ్రిష్టి ఆర్ట్ ఇలా ఏర్పాటు చేసినందుకు లక్ష్మీ నంబియార్‌కు థ్యాంక్స్. ఇక్కడకు నన్ను తీసుకొచ్చినందుకు ఆలపాటి దీప్తికి థాంక్స్ అని రెజీనా చెప్పుకొచ్చింది.


By November 08, 2021 at 03:43PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/regina-cassandra-does-like-samantha-in-art-project/articleshow/87584554.cms

No comments