Breaking News

పాక్ గెలుపుతో సంబరాలు చేసుకున్నారు.. భార్యపై పోలీసులకు భర్త ఫిర్యాదు!


టీ20 క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత్‌పై పాకిస్థాన్ గెలవడంతో దేశంలోని పలు చోట్ల సంబరాలు చేసుకున్నట్టు ఆరోపణలు రావడంతో కొందర్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ విషయమై తన భార్య, అత్తింటివారి ఫిర్యాదు చేయడం గమనార్హం. పాక్ గెలుపుతో సంబరాలు చేసుకున్నారని రామ్‌పూర్‌కి చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదు ఆధారంగా ఆయన భార్య, అలుళ్లపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. రామ్‌పూర్ ఎస్పీ అంకిత్ మిట్టల్ మాట్లాడుతూ.. ‘ఒక వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా భారత క్రికెట్ జట్టును ఎగతాళి చేసిన విషయం మా దృష్టికి రావడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశాం’ అని పేర్కొన్నారు. రామ్‌పూర్‌లోని అజీమ్ నగర్‌కు చెందిన ఇషాన్ మియా ఫిర్యాదు చేశారని చెప్పారు. ఇషాన్ మియా భార్య రబియా షాంసీ, అతడి బావమరుదులు పాకిస్థాన్ గెలవడంతో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అలాగే, పాక్ గెలుపును తమ వాట్సాప్ స్టాటస్‌లుగా పెట్టుకున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదుచేసినట్టు ఎస్పీ తెలిపారు. ఐపీసీ సెక్షన్ 153-ఏ, ఐటీ సవరణ చట్టం 2008లోని సెక్షన్ 67 కింద కేసు నమోదయ్యిందన్నారు. ‘ఇషాన్ మియా, భార్య రబియా షాంసీలకు వివాహమైన కొద్ది రోజులకే మనస్పర్దలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ప్రస్తుతం రబియా తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.. ఇంతకు ముందే ఆమె తన భర్త వరకట్న వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది’ అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కాగా, భర్త ఫిర్యాదు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.


By November 07, 2021 at 08:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/man-complaint-against-wife-in-laws-for-celebrating-pakistan-win-in-rampur-of-up/articleshow/87562978.cms

No comments