Breaking News

పెళ్లికి నిరాకరించాడని యువకుడిపై యాసిడ్ పోసిన వివాహిత!


తనను పెళ్లిచేసుకోడానికి నిరాకరించిన యువకుడిపై ఓ మహిళ యాసిడ్ దాడికి పాల్పడింది. నవంబరు 16న కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మహిళతో యువకుడికి ఫేస్‌బుక్‌లో పరిచయం కాగా.. ప్రేమకు దారితీసింది. అయితే, ఆమెకు ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలున్నట్టు యువకుడికి తెలియడంతో దూరం పెట్టాడు. మహిళ మాత్రం అతడిని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసింది. దీనికి బాధితుడు అంగీకరించినా యాసిడ్ దాడికి తెగబడింది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. కంటిచూపు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత యువకుడు అరుణ్ కుమార్ (28)కి షీబా (35) అనే మహిళ ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే, షీబాకు ఇది వరకే పెళ్లై ఇద్దరు పిల్లలున్న విషయం అరుణ్‌కు తెలియడంతో వెనక్కు తగ్గాడు. ఆమెతో సంబంధాన్ని ముగించాలని భావించిన అరుణ్‌పై షీబా కక్ష పెంచుకుంది. ఇద్దరి వ్యవహారం బయటపెడతానని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి డబ్బులు డిమాండ్ చేసింది. ఆమెను వదిలించుకోవాలని అరుణ్ డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అతడి బావ, స్నేహితుడు, అరుణ్ నవంబరు 16న అదిమళి సమీపంలోని చర్చి వద్ద డబ్బులు ఇవ్వడానికి ఆమెను కలుసుకున్నారు. ఈ సమయంలోనే అరుణ్ పక్కనే ఉన్న షీబా.. అతడి ఎదురుగా వచ్చి చేతిలోని యాసిడ్ పోసింది. ఈ క్రమంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. యాసిడ్ దాడిలో గాయపడిన అరుణ్.. చికిత్స కోసం అదిమళిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరాడు. తర్వాత అతడిని మెరుగైన వైద్యం కోసం తిరువనంతపురం మెడికల్ కాలేజీకి తరలించాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితురాలు షీబాను శనివారం అరెస్ట్ చేశారు. యాసిడ్ దాడితో యువకుడు కంటిచూపు కోల్పోయాడని, మెడ, ముఖం కాలిపోయానని పోలీసులు తెలిపారు.


By November 21, 2021 at 08:14AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-mother-of-2-pours-acid-on-youth-for-rejecting-marriage-proposal-in-kerala/articleshow/87826476.cms

No comments