Breaking News

Megastar Chiranjeevi: రూటు మార్చి మెహర్‌ రమేశ్‌ను కాస్త వెనక్కి నెట్టిన మెగాస్టార్ చిరంజీవి.. రీజన్ అదేనా?


మెగాస్టార్ చిరంజీవి.. ఆరున్న‌ర ప‌దుల వ‌య‌సులోనూ సినిమాల్లో త‌న క్రేజ్ త‌గ్గ‌లేదు. గ్రేస్ ఇసుమంత కూడా డ్రాప్ కాలేదు. డాన్సులు, యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో యంగ్‌స్ట‌ర్స్‌కు గ‌ట్టి పోటి ఇవ్వ‌డానికి ఆయ‌న రెడీ అయిపోతున్నారు. ఇప్ప‌టికే ఆచార్య సినిమాను పూర్టి చేసిన ఈ సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుడు ఇప్పుడు గాడ్‌ఫాద‌ర్ సినిమా షూటింగుతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాదిలోప‌లే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాల‌నేది ఆయ‌న ఆలోచ‌న‌. ఎందుకంటే మ‌రో సినిమాను ట్రాక్ ఎక్కించే ఆలోచ‌న‌తో చిరంజీవి ఉన్నార‌ట‌. గాడ్‌ఫాద‌ర్ కాకుండా చిరంజీవి ఇప్ప‌టికే మ‌రో రెండు సినిమాల‌ను క‌మిట్ అయ్యున్నారు. అందులో ఒక‌టి మెహ‌ర్ రమేశ్‌తో చేయ‌బోయే భోళా శంక‌ర్‌. మ‌రో సినిమా డైరెక్ట‌ర్ బాబీ తెర‌కెక్కించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే సినీ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోన్న తాజా స‌మాచారం మేర‌కు చిరంజీవి ఇప్పుడు చేయ‌బోతున్న ప్లాన్‌ను రీరూట్ చేశార‌ట‌. అందుకు కార‌ణాలున్నాయ‌ని కూడా స‌న్నిహిత వ‌ర్గాలు అంటున్నాయి. ఇంత‌కీ చిరు మార్చిన ప్లాన్ ఏంటి? అంటే మెహ‌ర్ ర‌మేశ్ ఎప్ప‌టి నుంచో చిరంజీవి సినిమాను ట్రాక్ ఎక్కించ‌డానికి వెయిట్ చేస్తున్నాడు. ఆయ‌న త‌ర్వాత బాబీ లైన్‌లోకి వ‌చ్చాడు. అయితే ఇప్పుడు మెగాస్టార్ బాబీ సినిమానే ముందుగా సెట్స్‌పైకి తీసుకెళ్లాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఆ త‌ర్వాత మెహ‌ర్ ర‌మేశ్ భోళా శంక‌ర్‌ను స్టార్ట్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. అందుకు స‌న్నాహాలు కూడా జ‌రిగిపోయాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న సినిమాను చిరంజీవి దీపావళి రోజున లాంఛ‌నంగా ప్రారంభిస్తార‌ట‌. అంటే దీపావ‌ళి పండుగ రోజున మెగాస్టార్ త‌న అభిమానులకు త‌న సినిమా ఓపెనింగ్ ద్వారా పెద్ద ట్రీట్ ఇవ్వ‌బోతున్నార‌న్న‌మాట‌. చిరంజీవి, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంబోయే సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అస‌లు మెగాస్టార్ త‌న ప్లాన్‌ను ఎందుకు మార్చుకున్నారంటే.. ఇప్పుడు ఆయ‌న చేస్తున్న గాడ్‌ఫాద‌ర్ మూవీ మ‌ల‌యాళ చిత్రం లూసిఫ‌ర్‌కు రీమేక్. ఆ వెంట‌నే మెహ‌ర్ ర‌మేశ్ భోళా శంక‌ర్‌ను స్టార్ట్ చేయ‌వ‌చ్చు. కానీ అది త‌మిళ చిత్రం వేదాళంకు రీమేక్‌. ఇలా రెండు వ‌రుస రీమేక్ సినిమాలు చేస్తే బాగోద‌ని భావించిన చిరంజీవి మెహ‌ర్ ర‌మేశ్‌ను మ‌రికొన్నిరోజులు వెయిట్ చేయ‌మ‌ని చెప్పి, ఆ స్థానంలో బాబీ సినిమాను చేయ‌డానికి రెడీ అయిపోయారనేదే సంగ‌తి అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. మరో వైపు కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ‘ఆచార్య’ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సిద్ధ అనే పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.


By October 22, 2021 at 08:26AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/megastar-chiranjeevi-rerooted-his-plan-and-fixed-his-next-movie-muhurtham/articleshow/87197574.cms

No comments