Breaking News

గోవిందా గోవిందా.. పవన్ కళ్యాణ్, విష్ణు ఇష్యూపై మంచు లక్ష్మి షాకింగ్ రియాక్షన్! అలా చేస్తారా అంటూ ఫైర్


ఇటీవలే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) నూతన అధ్యక్షడిగా ప్రమాణ స్వీకారం చేసిన .. ఆయన కుటుంబ సభ్యులు మంచు లక్ష్మి, మోహన్ బాబులతో కలిసి తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. తండ్రి మోహన్ బాబుతో కలిసి దిగిన ఓ ఫొటో షేర్ చేస్తూ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ''తిరుమలలో నాకు ఎంతో ఇష్టమైన దైవం బాలాజీ దర్శనం అద్భుతంగా జరిగింది. ఈ దర్శనం మాలో మరింత శక్తి నింపింది. ఆ వేంకటేశుని ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నా గోవింద గోవిందా'' అని ట్యాగ్ చేసింది మంచు లక్ష్మి. ఈ మేరకు మంచు లక్ష్మి షేర్ చేసిన ఫొటోలో కండువా ధరించి మోహన్ బాబు సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు. ఇకపోతే 'మా' ఎన్నికల అనంతరం జరుగుతున్న పరిణామాలు పలు అనుమానాలు లేవనెత్తుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మెగాస్టార్, మోహన్ బాబు వర్గాల విషయమై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన 'అలయ్ బలయ్' సమావేశంలో మంచు విష్ణు, ఎడమొహం పెడమొహం పెట్టుకున్నట్లు కొన్ని ఫొటోస్ వైరల్ అయ్యాయి. తాజాగా దీనిపై మంచు లక్ష్మి రియాక్ట్ అవుతూ అసలు విషయం బయటపెట్టింది. అలయ్, బలయ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, విష్ణు ఎడమొహం పెడమొహంగా ఉండలేదని పేర్కొన్న మంచు లక్ష్మి.. ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారని చెప్పింది. ఏదో ఒక ఫోటో పట్టుకొని సోషల్ మీడియాలో ఏవేవో కథలు అల్లేస్తున్నారంటూ ఆమె మండి పడింది. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.


By October 18, 2021 at 07:35AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/manchu-vishnu-visted-tirumala-venkateshwara-along-with-his-family/articleshow/87097563.cms

No comments