Breaking News

అది చూసి పూరి కన్నీళ్లు పెట్టుకున్నారు.. షూటింగ్ సీక్రెట్స్ చెప్పిన రొమాంటిక్ డైరెక్టర్


పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న '' సినిమాతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు . అక్టోబరు 29న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్ ఇప్పటికే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. అదే బాటలో తాజాగా మీడియాతో మాట్లాడిన డైరెక్టర్ అనిల్ పాదూరి.. ఈ సినిమా షూటింగ్ తాలూకు విశేషాలు పంచుకున్నారు. గతంలో తాను ఎవ్వరి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేయలేదని చెప్పిన అనిల్.. , ఛార్మి ప్రోత్సాహంతోనే ‘రొమాంటిక్‌’తో మెగా ఫోన్‌ పట్టానని చెప్పారు. ‘టెంపర్‌’ సినిమా సమయంలో ఎన్టీఆర్‌ తనను పూరి జగన్నాథ్‌కి పరిచయం చేశారని, అప్పటినుంచి ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నానని అన్నారు. ఓ రోజు పిలిచి రొమాంటిక్ కథకు దర్శకత్వం వహించమని అడిగారని, అలా ఈ సినిమాకు పునాది పడిందని తెలిపారు. మోహానికీ ప్రేమకీ తేడా ఏమిటి? ఓ కుర్రాడు తనది మోహం కాదు, ప్రేమే అనుకున్నప్పుడు ఏం చేశాడు అనేది ఈ సినిమా కథ అని అన్నారు అనిల్ పాదూరి. షూటింగ్ అయ్యాక ఎడిట్‌ రూమ్‌లో ఈ సినిమా అవుట్‌పుట్‌ చూసిన పూరి జగన్నాథ్ కంటతడి పెట్టుకొని కాసేపు బయటికెళ్లొచ్చారని తెలిపారు. నీకు మంచి భవిష్యత్తు ఉంది మంచి సినిమా తీశావ్‌ అని పూరి గారు మెచ్చుకున్నారని అనిల్ అన్నారు. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా రూపొందిన ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా రొమాంటిక్ సన్నివేశాలకు పెద్దపీట వేస్తూ 'రొమాంటిక్' మూవీ రూపొందించారని ఇప్పటివరకు విడుదలైన అప్‌డేట్స్ ద్వారా అర్థమైంది.


By October 25, 2021 at 07:40AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/romantic-promotions-director-anil-paduri-says-about-puri-jagannadh/articleshow/87247273.cms

No comments