Breaking News

నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని.. పీఎం కీలక ప్రకటన


శుక్రవారం ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. దేశంలో టీకా డోస్‌ల పంపిణీ 100 కోట్ల మార్క్‌ దాటి.. చరిత్రను లిఖించిన నేపథ్యంలో ప్రధాని ప్రసంగానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటి వరకూ ప్రపంచంలో చైనా మాత్రమే 100 కోట్ల డోస్‌లు పంపిణీ చేసింది. దీంతో 100 కోట్ల డోస్‌లు పంపిణీ చేసిన రెండో దేశంగా భారత్ నిలిచింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను‘ఆందోళన నుంచి భరోసా వరకు’ ఒక ప్రయాణంగా మోదీ అభివర్ణించారు. ‘అవిశ్వాసం, భయాందోళనలు సృష్టించడానికి వివిధ ప్రయత్నాలు చేసినప్పటికీ, టీకాలపై ప్రజల విశ్వాసానికి ఈ విజయం ఘనత.. దేశ సామర్థ్యాన్ని చాలా మంది సందేహించినప్పటికీ తొమ్మిది నెలల్లో ఈ మైలురాయిను సాధించాం’అని 100 కోట్ల మార్క్ దాటిన తర్వాత మోదీ ట్విట్టర్‌ అన్నారు. ఆరోగ్య సిబ్బంది, భారత శాస్త్రవేత్తలు, 130 మంది కోట్ల భారతీయుల వల్లే ఈ విజయం సాధ్యమైందని మోదీ పేర్కొన్నారు. వంద కోట్ల మైలురాయిని దాటిన వెంటనే ప్రధాని మోదీ దిల్లీలోని రామ్‌మనోహర్‌ లోహియా ఆసుపత్రిని సందర్శించారు. అక్కడి వైద్య సిబ్బందిని అభినందించారు.‘భారత శాస్త్రసాంకేతిక, పారిశ్రామిక రంగాలు, 130 కోట్ల ప్రజల సంయుక్త స్ఫూర్తి సాధించిన ఘన విజయాన్ని మనమిప్పుడు చూస్తున్నాం.. దేశం 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ను దాటినందుకు అభినందిస్తున్నాను’ అన్నారు. వైద్యులు, నర్సులు సహా ఈ గమ్యం చేరుకోవడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. దేశ ప్రజలకు సురక్షిత కవచం లభించింది.. ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు కార్పొరేట్‌, ప్రైవేటు, సామాజిక సంస్థలు ఎనలేని కృషి చేస్తున్నాయి. జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటులో ప్రైవేటు రంగానిదే కీలకపాత్ర’’ అని పేర్కొన్నారు. జనవరి 16న మొదలైన వ్యాక్సినేషన్... 279 రోజుల్లో 100 కోట్ల మార్క్‌ చేరుకొంది. దీంతో రోజూ సగటున 35,84,223 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించినట్టయింది. ఇప్పటివరకూ సుమారు 70% మందికి ఒక డోసు, 31% మందికి రెండు డోసులు పూర్తయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి


By October 22, 2021 at 08:42AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-to-address-nation-at-10-am-today-a-day-after-india-scripted-history-in-vaccination/articleshow/87197778.cms

No comments