Breaking News

అలవాటు ఏదైనా కావచ్చు అది మితంగా ఉండాలి! అందుకే రియాక్ట్ కాను.. సమంత కామెంట్స్ వైరల్


ఈ రోజుల్లో ఉపయోగం, దాని పరిణామాలు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. మారుమూలన ఉన్న గ్రామంలో కూడా టెక్నాలజీ అందుబాటులోకి రావడం, డిజిటల్ వైపుగా వెళుతున్న ఈ లోకంలో ప్రతి ఒక్కరి అరచేతిలో ప్రపంచం కనిపిస్తుండటం లాంటివి చూస్తున్నాం. ఈ క్రమంలో సోషల్ మీడియా ప్రభావం అందరిపై పడుతోంది. సామాజిక మాధ్యమాలను ఉపయోగించే విధానాన్ని బట్టి దాని పర్యవసనాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై రియాక్ట్ అయింది. ఇటీవలే గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శాకుంతలం' మూవీ కంప్లీట్ చేసిన సమంత.. కాసేపు మీడియాతో ముచ్చటిస్తూ సోషల్ మీడియా వల్ల గొప్ప ప్లస్‌లు, కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది. ''డిజిటల్ యుగం నడుస్తున్న ఈ రోజుల్లో.. నేను సోషల్ మీడియాకు దూరం అని ఎవరన్నా అంటే మాత్రం అది వాళ్ళ గొప్ప గుణమే అని నేననుకోను.. అలవాటు ఏదైనా కావచ్చు అది మితంగా, నియంత్రణలో ఉండాలి'' అని చెప్పిన సామ్.. అందుకే ట్రోల్స్ విషయంలో పెద్దగా రియాక్ట్ కాకుండా తనను తాను నియంత్రించుకుంటానని చెప్పింది. అలాగే ఒకవేళ రియాక్ట్ కావాల్సివస్తే అది మౌనం కంటే ఉత్తమమైనది అయి ఉండాలి అని తెలిపింది. కాగా, గత కొన్ని నెలలుగా హాట్ టాపిక్ అవుతున్న సమంత డివోర్స్ ఇష్యూకి రీసెంట్‌గా ఫుల్‌స్టాప్ పడింది. తామిద్దరం ఇకపై భార్యాభర్తలుగా కాకుండా స్నేహితులుగా మాత్రమే కొనసాగుతామని చై- సామ్ ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో వీళ్ళ డివోర్స్ ఇష్యూ గురించి రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి. విడాకులకు కారణాలు చెబుతూ ఎన్నో వార్తలు రాశారు. అయితే వాటిపై సమంత నుంచి గానీ, అక్కినేని ఫ్యామిలీ నుంచి గానీ ఎలాంటి క్లారిటీ రాలేదు.


By October 22, 2021 at 07:26AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/samantha-says-her-feelings-about-social-media-platforms/articleshow/87196848.cms

No comments