Breaking News

శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సీఎంపై మైత్రీ, డీవీవీ, దిల్ రాజు ప్రశంసలు


కరోనా కారణంగా కొన్ని రాష్ట్రాల్లో ఇంకా నిబంధనలు సడలించలేదు. థియేటర్లను తెరవలేదు. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా యాభై శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తూ వచ్చాయి. రోజుకు మూడు ఆటలే వేసేవారు. ఏపీలోనూ అదే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. అయితే మాత్రం ఇండస్ట్రీకి తీపి కబురు చెప్పింది. వంద శాతం ఆక్యుపెన్సీతో, రోజుకు నాలుగు ఆటలు వేసుకోవచ్చు అని ప్రకటించింది. దీంతో ఇండస్ట్రీలో అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు స్పందించాడు. ‘వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ప్రారంభించుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు ఏపీ ప్రభుత్వానికి థ్యాంక్స్. ముఖ్యమంత్రి గారికి మా హృదయ పూర్వక ధన్యవాదాలు. మంత్రి పేర్ని నాని గారి సహాయానికి థ్యాంక్స్. ఇది ఇండస్ట్రీకి ఊపిరినిచ్చే అంశం’ అని అన్నారు. నిర్మాణ సంస్థలైన డీవీవీ, మైత్రి కూడా స్పందించాయి. సంస్థ వేసిన పోస్ట్‌లొ ‘థియేటర్లో వందశాతం ఆక్యుపెన్సీని ప్రకటించినందుకు ఏపీ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి పేర్ని నారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి సమయంలో ఇది ఎంతో సాయం చేసే ప్రకటన’ అని చెప్పుకొచ్చింది. వేసిన పోస్ట్‌లో.. ‘ప్రతీ రోజూ నాలుగు షోలు, వందశాతం ఆక్యుపెన్సీతో అనుమతించినందుకు ముఖ్యమంత్రి జగన్, మంత్రి పేర్ని నాని గార్లకు ధన్యవాదాలు. మళ్లీ చిత్రపరిశ్రమకు పూర్వ వైభవం వచ్చేందుకు ఇది మంచి నిర్ణయం’ అని తెలిపింది. మొత్తానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో ఇండస్ట్రీలోని అందరూ ఫుల్ ఖుషీ అవుతున్నట్టు కనిపిస్తోంది.


By October 13, 2021 at 10:40PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/tollywood-biggies-glad-on-ap-cm-ys-jagan-mohan-reddy-decision-on-theatres/articleshow/87000115.cms

No comments