Breaking News

దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాల ఉప-ఎన్నికలకు పోలింగ్ షురూ


దేశవ్యాప్తంగా మొత్తం మూడు పార్లమెంట్ స్థానాలు, 30 అసెంబ్లీ స్థానాలకు ఉప-ఎన్నికలు పోలింగ్ ఉదయం 7.00 గంటలకు మొదలయ్యింది. ఏపీలో బద్వేలు, తెలంగాణలో హుజూరాబాద్ సహా పలు రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ సీట్లకు ఉప-ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉప-ఎన్నికలను , కాంగ్రెస్‌ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక, ఉప-ఎన్నికల నేపథ్యంలో ఆయా స్థానాల పరిధిలో కట్టుదిట్టమైన భద్రతను ఈసీ ఏర్పాటుచేసింది. అన్ని పోలింగ్ కేంద్రాలను వెబ్-కాస్టింగ్ ద్వారా అనుసంధానం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ్-19 నిబంధనలు తప్పనిసరి చేసింది. నవంబరు 2న ఓట్లు లెక్కించి, ఫలితాలను వెల్లడిస్తారు. దాద్రా నగర్ హవేలీ, మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా, హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్, తెలంగాణలోని హుజారాబాద్ నియోజకవర్గాలు, అసోంలో అత్యధికంగా ఐదు నియోజకవర్గాలకు ఉప-ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లోనే అసోం అసెంబ్లీకి ఎన్నికలు జరిగినా.. గొసాయ్‌గావ్, భబానీపూర్, తెముల్పూర్, మరియని, థ్వోరా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇక, పశ్చిమ్ బెంగాల్‌లోని నాలుగు స్థానాలకు (దినహాతా, శాంతిపూర్, ఖర్దాహా, గొసాబా), హిమాచల్‌ప్రదేశ్‌, మేఘాలయ, మధ్యప్రదేశ్‌లో మూడేసి, బిహార్‌, కర్ణాటక, రాజస్థాన్‌లో రెండేసి, మహారాష్ట్రలో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నిక జరుగుతోంది. బెంగాల్‌లోని ఖర్దాహా అసెంబ్లీ స్థానం అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు అత్యంత కీలకం. ఇక్కడ నుంచి మంత్రి సోవదేబ్ ఛటోపాధ్యాయ బరిలో ఉన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన భవానీపూర్ నుంచి గెలుపొందినా.. సీఎం మమతా కోసం రాజీనామా చేశారు. దీంతో ఆయన ఖర్దాహా నుంచి పోటీచేస్తున్నారు.


By October 30, 2021 at 07:22AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/three-lok-sabha-and-30-assembly-bypolls-today-big-battles-for-bjp-congress/articleshow/87383004.cms

No comments