Breaking News

బాలికపై కన్న తండ్రి సహా 28 మంది ఏళ్లుగా అత్యాచారం.. నిందితుల్లో పలు పార్టీల నేతలు


కన్న కూతురిపైనే నీచానికి ఒడిగట్టిన ఓ కామాంధుడు.. ఆ చిన్నారిని మరికొందరికి అప్పగించిన దారుణమైన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై కొన్నేళ్ల పాటు దాదాపు 28 మంది అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తండ్రే ఈ దారుణాలకు మూలకారకుడని బాలిక కన్నీటి పర్యంతమయ్యింది. తన తండ్రి, బీఎస్పీ, ఎస్పీలకు చెందిన నేతలు, సమీప బంధువులు ఉన్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించింది. బాధిత బాలికపై తొలిసారి ఆరో తరగతి చదువుతున్నప్పుడు తండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక ఫిర్యాదు ప్రకారం.. ‘ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేసే మా నాన్న ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే.. అసభ్యకరమైన చిత్రాలు చూపించి, లైంగికంగా లొంగదీసుకొనేందుకు ప్రయత్నించాడు.. నేను దాన్ని తీవ్రంగా ప్రతిఘటించాను. కొద్ది రోజుల ఒకరోజు నాకు కొత్త బట్టలు కొనిచ్చి, బైక్‌ డ్రైవింగ్ నేర్పిస్తానని నమ్మించి బయటకు తీసుకెళ్లాడు.. ఓ నిర్మానుష్య ప్రదేశంలో నాపై అత్యాచారం చేశాడు.. ఈ విషయం ఎవరికైనా చెప్తే.. మా అమ్మను చంపేస్తానని బెదిరించాడు. ఆ ఘటన తర్వాత ఒక రోజు స్కూల్ నుంచి వస్తుండగా మా నాన్న స్నాక్స్‌లో మత్తుమందు కలిపి తినిపించాడు. తర్వాత ఒక హోటల్‌కి తీసుకెళ్లిన ఓ మహిళకు అప్పగించాడు. కొద్ది సేపటికి ఆమె వెళ్లిపోగా.. అక్కడ నాపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నాకు స్పృహ వచ్చేసరికి నా ఒంటిపై దుస్తులు లేవు.. తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది. ప్రతిసారి నాకు ఇదే పరిస్థితి ఎదురయ్యేది. ఎవరో కొత్త వ్యక్తి వచ్చి ఏ మాత్రం జాలి లేకుండా లైంగిక దాడికి పాల్పడేవాడు. ఇలా ఎన్నోసార్లు జరిగింది. ఒకసారి ఎస్పీ పార్టీ లలిత్‌పూర్ అధ్యక్షుడు తిలక్ యాదవ్ వచ్చాడు. నేను వ్యతిరేకించడంతో నీ తండ్రే పంపాడని, కొన్ని రోజుల తర్వాత మీ అమ్మ కూడా వస్తుందని అత్యాచారానికి పాల్పడ్డాడు... తిలక్‌తోపాటు ఆయన స్నేహితులు, బంధువులు, మా బంధువులు నన్ను ఇలాగే తీవ్రంగా హింసించారు’ అంటూ తన దయనీయ పరిస్థితిని పోలీసులకు వెల్లడించింది. ఒకసారి అమ్మమ్మ ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ కూడా తన నలుగురు మేనమామలు కూడా అఘాయిత్యానికి పాల్పడ్డారని వాపోయింది. అమ్మమ్మ ఈ సంఘటన నుంచి కాపాడే ప్రయత్నం చేసిందని తెలిపింది. ఒక దశలో మేనమామలు తనను అమ్మేయడానికి ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారని బాలిక ఆరోపించింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. లలిత్‌పూర్ ఎస్పీ నిఖిల్ పాఠక్ మాట్లాడుతూ.. ఇది చాలా సున్నితమైన కేసని, దీనిని చాలా సీరియస్‌గా తీసుకున్నామని అన్నారు. బాలికకు వైద్య పరీక్షలను నిర్వహించామని తెలిపారు. మేజిస్ట్రేట్ ముందు బాలిక వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. కోర్టు ఆదేశాలతో ప్రస్తుతం బాలికకు భద్రతను కల్పించారు. ఇక, తిలక్ యాదవ్ తనపై ఆరోపణలను ఖండించారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) జిల్లా అధ్యక్షుడు తిలక్ యాదవ్‌ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. తనను, తన సోదరులను ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆరోపించిన ఆయన.. అత్యాచార ఆరోపణల్ని కొట్టిపారేశారు. ఏది ఏమైనప్పటికీ.. ఆ బాధితురాలు ఎదుర్కొన్న పరిస్థితి ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది.


By October 14, 2021 at 08:46AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/minor-girl-alleges-rape-by-father-sp-bsp-leaders-in-lalitpur-of-uttar-pradesh/articleshow/87010969.cms

No comments