Breaking News

Taliban మమ్మల్నే జైలుకు పంపుతారా? మహిళా న్యాయమూర్తుల కోసం గాలిస్తున్న తాలిబన్లు


‘ఎవరిపైనా ప్రతీకారం ఉండదు.. అందర్నీ క్షమించేశాం.. మహిళల హక్కులకు ఎటువంటి ఆటంకం’ ఉండదు ఇవి అఫ్గనిస్థాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత చేసిన తొలి ప్రకటన. తమ సహజ శైలికి భిన్నంగా తాలిబన్లు చేసి ఈ ప్రకటనలు విని అఫ్గన్ పౌరులే కాదు, అంతర్జాతీయ సమాజం కూడా నివ్వేరపోయింది. ఇవి కేవలం నీటి మాటలేని, తమలో ఉండే క్రూరత్వం అలాగే ఉందని తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. గత 20 ఏళ్లలో అమెరికా సైన్యం సాయంతో తమను ఇబ్బందులకు గురిచేసినవారి కోసం గాలిస్తున్నారు. గత అఫ్గనిస్థాన్‌ ప్రభుత్వంలో న్యాయమూర్తులుగా విధులు నిర్వర్తించిన మహిళలు.. భయంతో వణికిపోతున్నారు. వారిలో కొందరు ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోగా.. అలా వెళ్లలేని వారు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రహస్య ప్రదేశాల్లో దాక్కుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గత నెలలో అఫ్గన్ ఆక్రమించుకున్న వెంటనే తాలిబన్లు జైళ్లలో ఉన్న నేరస్థులకు విముక్తి ప్రసాదించారు. జైళ్ల గోడలను బద్దలుకొట్టి విడుదలైన వారిలో దాదాపుగా అందరూ గతంలో తాలిబన్ల తరఫున పనిచేశారు. వివిధ నేరాల్లో దోషులుగా తేలిన వీరికి శిక్ష విధించిన భయాందోళనకు గురవుతున్నారు. జైలు నుంచి విడుదలైన నేరస్థులు.. ప్రస్తుతం మహిళా న్యాయమూర్తుల కోసం గాలిస్తున్నారు. తమకు శిక్ష వేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో 220 మందికిపైగా మహిళా న్యాయమూర్తులు ప్రాణ భయంతో దాక్కున్నారని అంతర్జాతీయ మీడియా తెలిపింది. తమ రక్షణ కోసం కొందరు పేర్లను మార్చుకున్నారు. మాసూమా అనే మహిళా న్యాయమూర్తి తన కెరీర్‌లో అత్యాచారం, హత్యలు, వేధింపులకు గురిచేసి కేసుల్లో వందలాది మందిని దోషులుగా నిర్ధారించి, శిక్షలు వేశారు. అఫ్గన్‌ను తాలిబన్లు అక్రమించుకున్న తర్వాత జైలు నుంచి విడుదలైన ఈ దోషులు ప్రస్తుతం ఆమెను చంపుతామని బెదిరిస్తూ గుర్తుతెలియని మొబైల్ ఫోన్ నెంబర్ల నుంచి వాయిస్, టెక్స్ట్ మెసేజ్‌లు పంపుతున్నారు. తాలిబన్లు ఖైదీలను విడుదల చేశారని అర్ధరాత్రి వేళ తనకు తెలియడంతో అప్పటి కప్పుడే ఇంటి నుంచి కట్టుబట్టలతో పరారయ్యానని మాసూమా అనే జడ్జ్ తెలిపారు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా బుర్కా ధరించి కాబూల్ నగరం నుంచి కారులో తాలిబన్ల చెక్‌పోస్ట్‌లు దాటకుంటా వచ్చానని అన్నారు. భార్య పట్ల క్రూరమైన నేరానికి పాల్పడిన ఓ వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించానని, బాధితురాలి ముఖం ఇంకా నాకు గుర్తుందన్నారు. తీర్పునిచ్చి సమయంలో.. జైలు నుంచి విడుదలైన తర్వాత నీ అంతుచూస్తానని అతడు బెదిరించాడని మాసూమ్ గుర్తుచేశారు. గత 20 ఏళ్లలో 270 మంది మహిళలు న్యాయపీఠంపై కూర్చుకున్నారు. వీరిలో కొందరు అత్యంత శక్తివంతమైన న్యాయమూర్తులుగా గుర్తింపు పొందారు.


By September 30, 2021 at 07:59AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/afghaistan-female-judges-hunted-by-the-murderers-they-convicted-in-crimes/articleshow/86632981.cms

No comments