Breaking News

ట్వీట్లు వేసి మళ్లీ డిలీట్ చేసింది!.. డ్రగ్స్ కేసుపై పూనమ్ కౌర్.. ఇకపై అన్నీ అందులోనే!


ప్రస్తుతం టాలీవుడ్ ఎంతటి హాట్ టాపిక్‌గా మారిందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ సెలెబ్రిటీలపై ఈడీ కన్ను వేసింది. ఇప్పటికే పూరి జగన్నాథ్, ఛార్మీ, రకుల్ వంటి వారిని ఈడీ విచారించింది. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారం అంటే కేవలం సినిమా వాళ్లే కనిపిస్తున్నారా? అంటూ అసహనం వ్యక్తం చేసినట్టు కనిపిస్తోంది. గత రెండు మూడు రోజులుగా తాను ఎంతో బాధను అనుభవిస్తున్నాను అని పూనమ్ తన పరిస్థితిని చెప్పుకొచ్చారు. డ్రగ్స్ ఇష్యూ మీద కచ్చితంగా తాను మాట్లాడతాను అని పూనమ్ కౌర్ ట్వీట్ వేశారు. ఆ కాసేపటికే నిన్న పూనమ్ కౌర్ మరో ట్వీట్ వేశారు. ట్రగ్స్ అనేది కేవలం టాలీవుడ్ సమస్య కాదు.. అది అందరిది.. రాష్ట్రానిది, దేశానిది.. దేశ ఆర్థిక వ్యవస్థది.. దీనిపై నేను కచ్చితంగా మాట్లాడతాను.. స్వీయ అనుభవం చెబుతాను అంటూ పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు. ఆ తరువాత మరికాసేటికి కొన్ని స్క్రీన్ షాట్లను షేర్ చేసింది. కాంగ్రెస్ లీడర్లు డ్రగ్స్ సేవిస్తూ, విక్రయిస్తూ పడ్డట్టు వార్తలు వచ్చిన స్క్రీన్ షాట్లను షేర్ చేశారు. అయితే ఆ ట్వీట్లను పూనమ్ కౌర్ డిలీట్ చేసేశారు. ఇప్పుడు అవి కనిపించడం లేదు. అంటే ఆమె ఉద్దేశ్యంలో.. డ్రగ్స్ కేసు అంటే మీరు కేవలం సినిమా వాళ్లనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇందులో రాజకీయం కూడా దాగి ఉంది అని చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ డగ్ర్స్ కేసు గురించి మాట్లాడేందుకు మీడియాను పూనమ్ కౌర్ సంప్రదించారట. ఈ క్రమంలోనే పూనమ్‌కు మీడియా దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారట. లైవ్ అంటే కష్టం.. ముందుగా రికార్డ్ చేసుకుంటాం.. ఆ తరువాత మేం ఎడిట్ చేసుకోవడానికి వీలుంటుందని అన్నారట. అయితే అది చెత్త సలహా అని పూనమ్ అభిప్రాయపడ్డట్టున్నారు. ఇకపై నిష్పక్షపాతంగా ఉండే మీడియాతో లేదా నా సోషల్ మీడియా ఖాతాల్లోనే ఈ విషయం గురించి మాట్లాడతాను అని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు.


By September 04, 2021 at 06:59AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/poonam-kaur-shows-interest-on-drugs-case/articleshow/85916584.cms

No comments