Breaking News

పంజ్‌షీర్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. అఫ్గన్ మొత్తం వారి అధీనంలోకి!


దాదాపు మూడు దశాబ్దాలుగా తమకు కొరకరాని కొయ్యగా ఉన్న పంజ్‌షీర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు వర్గాలు ప్రకటించారు. ఉత్తర అఫ్గన్‌లోని లోయను శుక్రవారం ఆక్రమించుకున్నట్టు వెల్లడించారు. దీంతో మొత్తం అఫ్గనిస్థాన్ తమ వశమైనట్టు పేర్కొన్నాయి. ‘అల్లాహ్ దయతో మొత్తం అఫ్గనిస్థాన్‌ను మేం అధీనంలోకి తెచ్చుకున్నాం.. ఇబ్బందులకు గురిచేసిన ప్రత్యర్థులను ఓడించి పంజ్‌షీర్‌ను ప్రస్తుతం మా కమాండ్ హస్తగతం చేసుకుంది’ అని ఓ తాలిబన్ కమాండర్ తెలిపారు. అయితే, ఈ ప్రకటను తక్షణమే ధ్రువీకరించడం సాధ్యం కాదు. మరోవైపు, అఫ్గనిస్థాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న దేశం విడిచి పరారయ్యారని, కొందరు పంజ్‌షీర్‌ కమాండర్లతో కలిసి రెండు విమానాల్లో తజికిస్థాన్‌కు వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. అఫ్గన్‌ పౌరుల స్వేచ్ఛ కోసం పంజ్‌షీర్‌ పోరాటం సాగిస్తుందని గురువారం ప్రకటించిన అమ్రుల్లా.. ఆ మరుసటి రోజే దేశాన్ని విడిచి వెళ్లినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. తాలిబన్లు చుట్టుముట్టడంతో ప్రాణభయంతోనే ఆ ప్రాంతంలోని పలు ప్రధాన ఫైటర్లతో కలిసి పారిపోయినట్లు వార్తలు రాగా.. వాటిని ఆయన ఖండించారు. ‘పంజ్‌షీర్‌కు అన్ని రకాల రాకపోకలపై నిషేధం విధించారు. ఫోన్‌ సిగ్నళ్లు, విద్యుత్తు సరఫరా, చివరకు వైద్య సంబంధిత సామగ్రిని కూడా నిలిపివేశారు.. 23 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ మొదలైనప్పటి నుంచి కూడా తాలిబన్లకు అత్యవసర వైద్య సదుపాయాలను మేం నిలిపివేయలేదు. తాలిబన్లు యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వారి ఈ తీవ్రవాద ప్రవర్తనను ఐక్యరాజ్య సమితి, ప్రపంచ నేతలు గుర్తించాలి’ అని ఆయన వరుస ట్వీట్‌లు చేశారు. అయితే తాజా ట్వీట్లు సైతం ఆయన దేశం విడిచి వెళ్లిపోయారనే వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. పంజ్‌షేర్‌లో ఇంటర్నెట్‌ సేవలను తాలినబ్లు నిలిపివేశారని, అమ్రుల్లా అక్కడే ఉంటే ఈ ట్వీట్లు ఎలా చేయగలిగారని స్థానిక మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, దేశం విడిచి పారిపోయారని తనపై వస్తున్న ఆరోపణలను అమ్రుల్లా సలేహ్ కొట్టిపారేశారు. తాను పంజ్‌షీర్‌లోనే ఉన్నట్లు బీబీసీ మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం తన బేస్‌పాయింట్‌నే నుంచే మాట్లాడుతున్నట్లు వారికి పంపిన వీడియోలో తెలిపారు. తమ కమాండర్లు, రాజకీయ నేతలతో ఇక్కడే ఉన్నట్లు పేర్కొన్నారు. పంజ్‌షీర్‌ లోయలోని పలు ప్రాంతాలను తాలిబన్లు హస్తగతం చేసుకున్నారనే వార్తలను సైతం ఆయన కొట్టిపారేశారు. ఈ ప్రాంతం మొత్తం తమ అధీనంలోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. ‘తాలిబన్ దండయాత్రతో మేము క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం... ఇందులో ఎటువంటి సందేహం లేదు.. మేము యుద్ధ క్షేత్రంలో ఉండి పోరాడుతున్నాం’ అని తెలిపారు అమ్రుల్లా సలేహ్ తనయుడు ఎబ్దుల్లాహ్ సలేహ్ సైతం తాలిబన్లు పంజ్‌షీర్‌ను ఆక్రమించుకున్నారనేది తప్పుడు వార్తని ఓ మెసేజ్‌లో పేర్కొన్నారు. పంజ్‌షీర్‌ లోయను తాలిబన్లు వశం చేసుకోడానికి చేస్తున్న ప్రయత్నాలను అక్కడ ముజాయిద్దీన్, అఫ్గన్ మాజీ ప్రభుత్వ సైనికులు అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ తాలిబన్, అఫ్గన్ సైనికులకు భీకర పోరు కొనసాగుతోంది. భారీ సంఖ్యలో తాలిబన్ల చనిపోయినట్టు నివేదికలు అందుతున్నాయి.


By September 04, 2021 at 07:06AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/taliban-sources-said-islamist-militia-had-seized-in-panjshir-valley/articleshow/85916625.cms

No comments