Breaking News

నేనేమీ డబ్బులు తీసుకుని చెప్పడం లేదు!.. రేణూ దేశాయ్ కామెంట్స్ వైరల్


సందడి ఇప్పుడు మొదలైంది. ఎక్కడ చూసిన వివిధ రూపాల్లో వినాయకుడి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. రకరకాల రంగులు, వింత రూపాల్లో గణేశుడి విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఇక ఎప్పటిలానే పర్యాణ వరణ ప్రేమికులు మాత్రం సీడ్ గణేశుడు, మట్టి వినాయకులను ప్రమోట్ చేస్తున్నారు. రంగులు పూసిన ఆ వినాయకుడి విగ్రహాలను, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకులను వాడొద్దని వేడుకుంటున్నారు. కానీ వినేవారు ఎవ్వరూ లేరని అందరికీ తెలిసిందే. అయితే కొంత మందిలో మాత్రం మార్పు కనిపిస్తోంది. భారీ భారీ విగ్రహాల జోలికి వెళ్లకుండా మట్టితో తయారు చేసిన విగ్రహాలను కొనుక్కుంటున్నారు. ఇక విత్తన వినాయకుడిని కూడా చాలా మంది వాడుతున్నారు. దీని వల్ల మొక్కలు కూడా పెరుగుతాయి. అలా తాజాగా సీడ్ గణేశుడిని వాడండి అంటూ చెప్పుకొచ్చారు. దీని కోసం ఓ సంస్థ వేసిన యాడ్‌ను రేణూ దేశాయ్ షేర్ చేశారు. మామూలుగా ఇప్పుడు సెలెబ్రిటీలందరూ కూడా ఇన్ స్టాగ్రాంను బ్రాండ్లను ప్రమోట్ చేసేందుకు వాడుతున్న సంగతి తెలిసిందే. అలా తనను కూడా అందరూ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తుందేమోనని అనుకుంటారని రేణూ దేశాయ్ ముందే క్లారిటీగా చెప్పారు. ఇదేమీ పెయిడ్ ప్రమోషన్ కాదని, డబ్బులు ఏమీ తీసుకోలేదని చెప్పేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ద్వారా తయారు చేసిన విగ్రహాలను వాడకండని రేణూ దేశాయ్ అందరికీ సలహా ఇచ్చారు. మొత్తానికి రేణూ దేశాయ్ ఇచ్చిన ఈ సందేశాన్ని ఎంత మంది పాటిస్తారో మరి.


By September 03, 2021 at 10:25PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/renu-desai-shares-eco-friendly-ganesh-statue/articleshow/85905479.cms

No comments