Breaking News

ప్రభుత్వ ఏర్పాాటుపై తాలిబన్లలో సందిగ్ధత.. మరోసారి వాయిదా.. విభేదాలే కారణమా?


నుంచి అమెరికా సైన్యం తరలింపు పూర్తయినా ప్రభుత్వం ఏర్పాటుపై తాలిబన్లు మల్లగుల్లాలు పడుతున్నారు. వాస్తవానికి శుక్రవారం ప్రార్థనల అనంతరం కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని నేతలు ప్రకటించారు. తర్వాత శనివారానికి వాయిదా పడింది. కానీ, మరోసారి వాయిదా పడినట్టు తాలిబన్ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ ప్రకటించారు. కొత్త ప్రభుత్వం, క్యాబినెట్ సభ్యుల వివరాల ప్రకటన వచ్చే వారం ఉంటుందని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. అంతర్జాతీయ సమాజం ఆమోదం పొందేలా నాయకత్వానికి తుదిరూపు ఇవ్వడంలో తాలిబన్లు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వానికి తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నేతృత్వం వహిస్తారని, దీనిపై శనివారం ప్రకటన వస్తుందని అంతా భావించారు. అయితే.. మరోమారు వాయిదా పడటంతో తాలిబన్ల మధ్య అంతర్గతంగా విబేధాలు ఉన్నాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుపై వివిధ వర్గాలతో చర్చించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు ఖలీల్ హక్కానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ సమాజం ఆమోదించేలా విస్తృతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాలిబన్లు భావిస్తున్నారని, అందుకే జాప్యం జరుగుతోందని అన్నారు. ‘తాలిబన్లు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలరు. కానీ, వారి పరిపాలనా విభాగంలో అన్ని పార్టీలు, వర్గాలు, సమాజంలోని పలువురికి సముచిత స్థానం కల్పించాలని భావిస్తున్నారు. తాలిబన్లతోనే కూడిన ప్రభుత్వాన్ని ప్రపంచం ఆమోదించకపోవచ్చు.. అఫ్గన్ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ సోదరుడు గుల్బుద్దీన్ హెక్మాత్యార్కు ప్రభుత్వంలో చోటు దక్కనుంది.. ప్రభుత్వానికి మద్దతు కూడగట్టేందుకు ఇతర భాగస్వామ్య గ్రూప్లతోనూ చర్చలు జరుగుతున్నాయి’ అని తెలిపారు. పాకిస్థాన్ నిఘా విభాగం అధినేత జనరల్ ఫైజ్ హమీద్ ఆకస్మికంగా కాబుల్లో పర్యటించారు. ఈ విషయాన్న పాక్ అధికారులు ధ్రువీకరించారు. తాలిబన్ నాయకత్వంతో ఎలాంటి చర్చలు చేపట్టారనేది ప్రస్తుతానికి తెలియదన్నారు. అయితే, తాలిబన్ల ఆహ్వానం మేరకే ఆయన అఫ్గన్‌కు వచ్చినట్టు స్థానిక మీడియా పేర్కొంది. ప్రభుత్వ ఏర్పాటు కసరత్తును కొలిక్కి తీసుకొచ్చేందుకు పాక్ ఐఎస్ఐ అధినేత వచ్చారని తెలిపింది. మరోవైపు, పాక్‌లో పర్యటిస్తున్న బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్‌తో శనివారం సమావేశమైన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా.. అఫ్గన్‌లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని స్పష్టం చేశారు. అఫ్గన్‌లో శాంతి, స్థిరత్వానికి పాకిస్థాన్ పోరాటం చేస్తుందని, ఇదే సమయంలో అన్ని వర్గాలను సమన్వయం చేసే ప్రభుత్వం ఏర్పాటుకు సాయం చేస్తుందన్నారు.


By September 05, 2021 at 09:30AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/afghanistan-taliban-postponed-formation-of-a-new-government-for-next-week/articleshow/85941637.cms

No comments