Breaking News

సాయిధరమ్‌తేజ్‌ హాస్పిటల్ మార్పు.. అపోలో హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్


మెగా కుటుంబానికి చెందిన యంగ్ హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ ఐకియా- కేబుల్ బ్రిడ్జ్‌పై ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో స్పోర్ట్స్ బైక్ స్కిడ్ కావ‌డంతో ప్ర‌మాదానికి గుర‌య్యారు. కుడిక‌న్ను, ఛాతీ, క‌డుపుపై గాయాల‌య్యాయి. వెంట‌నే అంబులెన్స్‌లో మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అక్క‌డ ప్రాథ‌మిక చికిత్స చేసిన అనంత‌రం చిరంజీవి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్, అల్లు అర‌వింద్ వంటి వారి విజ్ఞ‌ప్తి మేర‌కు సాయితేజ్‌ను అపోలో హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఇప్పుడు అపోలోలోని ఐసీయూ విభాగంలో సాయితేజ్‌కు చికిత్స జ‌ర‌గుతుంది. ముగ్గురు డాక్ట‌ర్స్ ఆధ్వర్యంలో చికిత్స‌లు జరుగుతున్నాయి. అపోలో హాస్పిట‌ల్‌లో కూడా, వైద్యులు స్కానింగ్ స‌హా అన్నీ చికిత్సలు చేస్తున్నారు. ఇప్ప‌టికే చిరంజీవి, నాగ‌బాబు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, అల్లు అర‌వింద్‌, వ‌రుణ్‌తేజ్‌, నిహారిక త‌దిత‌రులు అపోలో హాస్పిట‌ల్‌కు చేరుకున్నారు. స్కానింగ్ రిపోర్టుల ప్ర‌కారం మెద‌డు, పుర్రె భాగాల‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ప‌క్క‌టెముక‌ల నుంచి చేతికి ఉండే ఎముక విరిగిన‌ట్లు తెలుస్తుంది. ప్రాణాపాయం లేద‌ని, ప్ర‌స్తుతానికి ఇంకా సాయితేజ్ అప‌స్మార‌క స్థితిలోనే ఉన్నారు.


By September 10, 2021 at 11:40PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/saidharamtej-met-with-accident-shifted-to-apollo-hospitals/articleshow/86100736.cms

No comments