Breaking News

భోపాల్: నది ఒడ్డున వెండి నాణేలు.. ఎగబడ్డ జనం, పెద్ద చరిత్ర ఉంది


మధ్యప్రదేశ్‌లో వెండి నాణేలు కలకలంరేపాయి. గుణ జిల్లాలో భారీ వర్షాలకు అశోక్‌నగర్‌లోని పంచవాలిలో సింధ్ నది పొంగిపొర్లుతోంది. ఆదివారం వరద కాస్త తగ్గుముఖం పట్టగా.. నది తీరంలో నడుచుకుంటూ వెళ్తున్న కొంతమందికి వెండి నాణేలు దొరికాయని ప్రచారం జరిగింది. వాటిని వెతుక్కుంటూ వెళ్లిన వారికి కొన్ని నాణేలు దొరికాయని తెలియడంతో స్థానికులంతా నది ఒడ్డుకు పరుగులు పెట్టారు. నాణేల కోసం ఎగబడ్డారు. ఈనాణేలపై బ్రిటిష్ రాణి విక్టోరియా బొమ్మలున్నాయట. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ నాణేలు బ్రిటిష్ రాణి విక్టోరియా కాలం నాటివిగా తెలుస్తోంది. మరికొన్ని1862 కాలం నాటివి కూడా ఉన్నాయి. ఎవరైనా ఇంట్లో దాచిపెట్టుకున్నవి, వరదలు కారణంగా కొట్టుకుని వచ్చాయా? నదిలోకి నాణేలు ఎలా వచ్చాయి అనేదానిపై స్పష్టత లేదు. యువకులు, స్థానికులు తవ్వకాలు మొదలు పెట్టారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు నాణేలు సేకరించిన వారిని ప్రశ్నించారు. నాణేలపై సోషల్‌ మీడియా ద్వారా తమకు సమాచారం తెలిసిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు సిద్ధమయ్యారు.


By August 11, 2021 at 08:44AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/madhya-pradesh-rumors-on-silver-coins-found-in-sindh-river-area-local-people-searching-in-sand/articleshow/85230402.cms

No comments