Breaking News

రైతుల పిల్లలకు శుభవార్త.. ఈ ఏడాది నుంచే స్కాలర్‌షిప్‌


రైతుల పిల్లలకు ప్రత్యేకంగా ఉపకార వేతనాలను అందజేయాలని కర్ణాటక క్యాబినెట్ నిర్ణయించింది. కొత్త నేతృత్వంలోని మంత్రివర్గం శనివారం తొలిసారిగా సమావేశమయ్యింది. ఈ సమావేశంలోనే ఉపకారవేతనాల చెల్లింపు విషయంలో నిర్ణయం తీసుకున్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తోన్న రైతుల పిల్లలకు రూ.1000 కోట్లతో ఉపకారవేతనాలు అందజేయనున్నట్టు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. ఈ స్కాలర్‌షిప్‌లను నేరుగా విద్యార్థుల ఖాతాలకే జమచేయనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. పదో తరగతి పూర్తిచేసి పై చదువులకు గుర్తింపు పొందిన ఏదైనా విద్యా సంస్థ లేదా యూనివర్సిటీలోని కోర్సుల్లో చేరిన రైతుల పిల్లలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే ఉపకారవేతనాలను జమ చేస్తారు. పీయూసీ లేదా ఐటీఐ చదువుతున్న బాలురకు రూ.2,500, బాలికలకు రూ.3,000 అందజేస్తారు. అలాగే, అండర్ గ్రాడ్యుయేషన్ లేదా ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ డిగ్రీ చదువుతున్న అబ్బాయిలకు రూ.5,000, అమ్మాయిలకు రూ.5,500.. లా, పారామెడికల్, నర్సింగ్ ఇతర ఒకేషనల్ కోర్సులు చదువుతుంటే రూ.7,000 (అబ్బాయిలు), రూ.7,500 (అమ్మాయిలు) చెల్లిస్తారు. అలాగే, పోస్ట్-గ్రాడ్యుయేషన్ లేదా ఆపైస్థాయి కోర్సులను చదివే యువకులకు రూ.10 వేలు, యువతులకు ర.11 వేలను కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, రైతుల పిల్లలు ఇప్పటికే మెరిట్ స్కాలర్‌షిప్‌లు పొందుతున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం చే పథకం వర్తించదని స్పష్టం చేశారు. ప్రత్యేక కోర్సులకు ఈ స్కాలర్ షిప్‌లు అందజేస్తారు. ఉదాహరణకు ఓ సబ్జెక్టులో పీజీ చదివి స్కాలర్‌షిప్ పొందిన విద్యార్ధి.. తర్వాత మరో సబ్జెక్టులో పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సులో జాయిన్ అయితే ఉపకారవేతనం లభించదు.


By August 08, 2021 at 02:17PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-government-issues-order-on-scholarships-for-farmers-childrens/articleshow/85148056.cms

No comments