Breaking News

Indian Journalist అఫ్గన్‌ సైన్యంతో పోరు.. తాలిబన్ల కాల్పుల్లో భారతీయ జర్నలిస్ట్ మృతి


అమెరికా సైన్యాలు ఉపసంహరణతో అఫ్గనిస్థాన్‌లో మళ్లీ రెచ్చిపోతున్నారు. వారిని అడ్డుకోడానికి అఫ్గన్ సైన్యం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తాలిబన్లు, ప్రభుత్వ దళాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. ఈ పోరాటంలో ప్రముఖ భారత ఫొటో జర్నలిస్టు, పులిట్జర్‌ అవార్డు గ్రహీత డానిశ్‌ సిద్దీఖి శుక్రవారం మృతి చెందారు. రాయిటర్స్‌ వార్తా సంస్థలో చీఫ్‌ ఫొటోగ్రాఫర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సిద్దీఖి.. అఫ్గన్ సైన్యం, తాలిబన్ల మధ్య సాగుతున్న పోరాటాన్ని కవర్ చేస్తున్నారు. అందులో భాగంగానే కాందహార్‌లోని స్పిన్‌ బోల్డక్‌కు అఫ్గాన్‌ దళాలతో కలిసి వెళ్లారు. పాక్‌ సరిహద్దుకు దగ్గరగా ఉండే ఈ ప్రాంతాన్ని ఇటీవల తాలిబన్లు ఆక్రమించుకున్నారు. ఈ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో సిద్దీఖి సహా అఫ్గన్‌ సైన్యానికి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. .. ఢిల్లీలో జామియా మిలియా యూనివర్సిటీ నుంచి 2007లో మాస్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పూర్తి చేశారు. టెలివిజన్‌‌లో న్యూస్‌ కరస్పాండెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. తర్వాత ఫొటో జర్నలిస్టుగా మారి రాయిటర్స్‌‌లో చేరారు. రోహింగ్యా శరణార్థులపై తీసిన ఫొటోలకు ప్రతిష్ఠాత్మక ‘పులిట్జర్‌’ అవార్డును అందుకున్నారు. సిద్దీఖి హత్యను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ‘‘కాందహార్‌లో విధులు నిర్వరిస్తున్న భారత ఫొటో జర్నలిస్టు సిద్దీఖి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం.. వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నాం’’ అని విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్షవర్ధన్‌ ఐక్యరాజ్యసమితిలో తెలిపారు. ఈ ఘటనపై అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక స్నేహితుడిని కోల్పోయానని అఫ్గాన్‌లోని భారత రాయబారి ఫరిద్‌ ముముంద్‌జే ట్వీట్‌ చేశారు. రెడ్ క్రాస్ సంస్థకు సిద్దీఖి మృతదేహాన్ని తాలిబన్లు అప్పగించడంతో భారత్‌ తరలించడానికి అక్కడ రాయబార కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. కాబూల్‌లోని భారత రాయబారి అక్కడి అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారని, సమాచారాన్ని సిద్దీఖి కుటుంబసభ్యులకు కూడా అందజేస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ తెలిపారు. సిద్దీఖి మృతిపై కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెరెస్‌, ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ ఇండియా, ఇతర జర్నలిస్టు సంఘాలు విచారం వెలిబుచ్చాయి.


By July 17, 2021 at 07:56AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-photo-journalist-danish-siddiqui-killed-in-line-of-duty-by-taliban/articleshow/84492401.cms

No comments