Breaking News

కేంద్ర క్యాబినెట్... ఎవరెవరికీ ఏ ఏ శాఖలు.. కిషన్ రెడ్డికి ఏ శాఖంటే?


గత రెండేళ్లలో మంత్రుల పనితీరు, రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని క్యాబినెట్‌లో ప్రధాని భారీ మార్పులు చేశారు. పనితీరు సరిగా లేని, క్రియాశీలకంగా వ్యవహరించని 12 మందిని పక్కనపెట్టారు. సహాయ మంత్రులుగా ఉంటూనే పనితీరుతో మెప్పించినందుకు నలుగురు స్వతంత్ర, ముగ్గురు సహాయ మంత్రులకు క్యాబినెట్‌లో స్థానం కల్పించి శ్రమను గుర్తించారు. వీరిలో జి.కిషన్‌రెడ్డి, కిరణ్‌ రిజీజు, ఆర్‌.కె.సింగ్‌, హర్‌దీప్‌సింగ్‌ పురి, మన్సుఖ్‌ మాండవీయ, పురుషోత్తం రూపాలా, అనురాగ్‌ ఠాకుర్‌ ఉన్నారు. బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌ దర్బార్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ 43 మందితో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 77 మంది మంత్రుల్లో ఓబీసీల 27, ఎస్సీలు 12, ఎస్టీలు 8, మైనార్టీలు ఐదుగురు ఉన్నారు. మిగితా 25 మంది విభిన్న సామాజిక వర్గాలకు చెందినవారు కాగా.. నలుగురికి సీఎంలుగా పనిచేసిన అనుభవం ఉంది. క్యాబినెట్‌లో 25 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం లభించినట్లయింది. 1) నరేంద్ర మోదీ: ప్రధానమంత్రి, సిబ్బంది వ్యవహారాలు, అంతరిక్షం, అణుఇంధనం, ఫించన్లు. 2) రాజ్‌నాథ్ సింగ్: రక్షణ శాఖ 3) అమిత్ షా: హోం, సహకార శాఖ 4) నితిన్ గడ్కరీ: ఉపరితల రవాణా, జాతీయ రహదారులు 5) నిర్మలా సీతారామన్: ఆర్ధిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ 6)నరేంద్ర సింగ్ తోమర్: వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ 7) ఎస్ జయశంకర్: విదేశీ వ్యవహారాల శాఖ 8) అర్జున్ ముండా: గిరిజన సంక్షేమ శాఖ 9) స్మృతి జుబిన్ ఇరానీ: మహిళ, శిశు సంక్షేమ శాఖ 10) పీయూష్ గోయల్: వాణిజ్య, పరిశ్రమలు, జౌళి, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ 11) ధర్మేంద్ర ప్రధాన్: విద్య శాఖ 12) ప్రహ్లాద్ జోషి: పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనులు, 13) నారాయణ్ రాణే: సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు 14) ముఖ్తార్ అబ్బాస్ నక్వీ: మైనార్టీ వ్యవహరాలు 1 5) శర్బానంద్ సోనోవాల్: ఓడరేవులు, నౌకాయానం, ఆయుష్ శాఖ 16)వీరేంద్ర కుమార్: సామాజిక న్యాయం, సాధికారికత శాఖ 17) జ్యోతిరాదిత్య సింధియా: పౌరవిమానయాన శాఖ 18) గిరిరాజ్ సింగ్: గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ 19) రామచంద్ర ప్రసాద్ సింగ్: ఉక్కు పరిశ్రమల శాఖ 20) అశ్వని వైష్ణవ్: రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఐటీ కమ్యూనికేషన్ శాఖ 21) పశుపతి కుమార్ పరాస్: ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ 22) గజేంద్ర సింగ్ షెకావత్: జల్ శక్తి శాఖ 23) కిరణ్ రిజిజు: న్యాయశాఖ 24) రాజ్‌కుమార్ సింగ్: విద్యుత్ శాఖ 25) హర్‌దీప్ సింగ్ పూరి: పెట్రోలియం, సహజవాయువు, పట్టణాభివృద్ధి శాఖ 26) మన్‌సుఖ్ మాండవీయ: అరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ 27) భూపేంద్ర యాదవ్: అటవీ, పర్యావరణం, కార్మిక శాఖ 28) పురుషోత్తం రూపాలా: మత్స్య, పశు సంవర్ధక శాఖ 29) జి కిషన్ రెడ్డి: సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి. 30) మహేదంద్ర నాథ్ పాండే: భారీ పరిశ్రమల శాఖ 31) అనురాగ్ సింగ్ ఠాకూర్: సమాచార ప్రసార శాఖ, క్రీడలు, యువజన వ్యవహారాలు రావ్ ఇంద్రజిత్ (ప్రణాళిక గణాంకాలు), జితేంద్ర సింగ్‌ (శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, భూవిజ్ఞ‌ానం)లకు స్వతంత్ర హోదా కట్టబెట్టారు.


By July 08, 2021 at 07:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/modi-cabinet-reshuffle-meet-the-new-minsters-whos-got-what/articleshow/84223579.cms

No comments