Breaking News

చావనైనా చస్తాను కానీ.. వెనుకడుగు వేయబోం.. లాలూ సంచలన వ్యాఖ్యలు


బెయిల్‌పై బయటకు వచ్చిన బిహార్ మాజీ సీఎం .. చాలా కాలం తర్వాత మీడియా ముందుకొచ్చారు. అనారోగ్యానికి గురై ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స తర్వాత కోలుకున్న ఆయన ప్రస్తుతం తన కుమార్తె ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏర్పాటుచేసి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్‌డీఏ ప్రభుత్వంపై పోరాటంలో వెనుకంజవేసే ప్రసక్తేలేదని ప్రతిజ్ఞ చేశారు. త్వరలోనే తాను, తన పార్టీ ఆట మొదలుపెడతామని ప్రకటించారు. అంతేకాదు,‘మేం చావనైనా చస్తాం కానీ వెనుకడుగుమాత్రం వేయబోం’ అని స్పష్టం చేశారు. చాలాకాలం తరువాత రాజకీయాలపై లాలూ సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, బిహార్‌లో నితీశ్‌ పాలన అనేక అంశాల్లో వైఫల్యం చెందిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను ఊహించని స్థాయిలో తన కుమారుడు తేజస్వీ యాదవ్‌ పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతున్నాడని ప్రశంసించారు. అంతేకాదు, ఈ రోజు తాను ప్రాణాలతో ఉన్నానంటే తన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వీలే కారణమన్నారు. వారి కోసమే తాను రాంచీలో జైలు శిక్ష అనుభవించానని తెలిపారు. ‘తేజస్వీ నుంచి నేను ఈస్థాయి పనితీరు ఊహించలేదు.. ఆర్జేడీ నావను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు... పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది’ అని కితాబిచ్చారు. పూర్తిగా కోలుకున్న తరువాత త్వరలో బిహార్‌ వస్తానని, అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని ఆర్జేడీ నాయకులకు లాలూ హామీ ఇచ్చారు. గతేడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి లాలూ లేకుండానే ఆర్జేడీ పోరాటం చేసింది. నాయకత్వంలో ఆ పార్టీ ఎన్డీయేకు గట్టిపోటీ ఇచ్చింది. తేజస్వీ పోరాటంతో ఎన్డీయే కూటమి బొటాబొటి స్థానాలతోనే అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక, దాణా కుంభకోణం కేసులో మూడేళ్ల పాటు లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్నారు. డిసెంబరు 2017 నుంచి ఏప్రిల్ 2021 వరకు జైల్లోనే ఉన్నారు.


By July 06, 2021 at 08:36AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/will-die-but-wont-retreat-says-rjd-leader-lalu-yadav-first-appearance-after-jail/articleshow/84161979.cms

No comments