Breaking News

యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. నిందితుడ్ని పట్టించిన శవంపై వీర్య కణాలు!


ఓ యువతి ఆత్మహత్య కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అత్యాచారం జరిగినట్టు పోస్ట్‌మార్టం‌లో బయటపడింది. నిందితుడి వీర్యం ఆమె ప్రయివేట్ అవయవాల్లో గుర్తించారు. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన గుజరాత్‌లో వడోదరలో వెలుగులోకి వచ్చింది. తనపై అత్యాచారం జరగడంతో అవమానంతో బాధితురాలు బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు ఓ కాల్ సెంటర్‌లో ఉద్యోగిగా పనిచేస్తోంది. అదే సంస్థలో పనిచేస్తున్న నిందితులు జూన్ 8 న ఓ ప్రయివేట్ పార్టీలో ఆమెతో బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం వారిలో ఒకరు ఆమెపై అత్యాచారం చేశార‌ని పోలీసులు తెలిపారు. అవమానంతో ఆమె జూన్ 10 ఉదయం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేర‌కు బాధితురాలి తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ‘‘ఘటనపై ఫిర్యాదు చేయడానికి కుటుంబ స‌భ్యులు మమ్మల్ని సంప్రదించనప్పుడు తండ్రితో విభేదాల కారణంగా ఆమె వేరుగా నివసిస్తున్న‌ట్లు తెలిసింది. దీంతో మాకు అనుమానం బలపడింది.. కుమార్తె ఇబ్బందుల గురించి తెలియదని కుటుంబం తెలిపింది.. శవపరీక్ష సమయంలో నిర్దిష్ట ఫోరెన్సిక్ పరీక్ష చేయాల‌ని నిపుణుల‌ను కోరాం.. పోస్టుమార్టం సమయంలో ఆమె గర్భాశయ ప్ర‌దేశంలో వీర్య కణాల ఉనికిని గుర్తించారు.. ఆ తరువాత లైంగిక వేధింపుల కోణంలో విచారించడంతో నిందితుల గురించి తెలిసింది’’ అని కేసును విచారిస్తున్న‌ పోలీస్ అధికారి తెలిపారు. నిందితులను ఆదివారం కోర్టులో ప్రవేశపెట్టడంతో రిమాండ్ విధించింది. ‘‘ఈ నేరం వెనుక ఎటువంటి కుట్రలేదు.. నిందితుడు మృతురాలిని వెంబడించలేదు.. సహోద్యోగి కావడంతో పార్టీలో బలవంతంగా మద్యం తాగించారు... ఆమె మత్తులో ఉన్నప్పుడు పక్కనున్న గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు’’ అని పోలీస్ అధికారి వివరించారు. ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి బాధితురాలి రాసిన ఏడు పేజీల సూసైడ్ లేఖ లభ్యమయ్యింది. గతేడాది తల్లిని కోల్పోయిన తర్వాత ఆమె మానసిక పరిస్థితికి సూసైడ్ అద్ధం పడుతోందని అన్నారు.


By June 13, 2021 at 02:13PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/19-year-old-women-suicide-autopsy-finding-on-sperm-cell-presence-led-to-arrest-in-gujrat/articleshow/83480092.cms

No comments