Breaking News

మరోసారి తప్పుడు మ్యాప్.. కేంద్రం వార్నింగ్‌తో వెనక్కు తగ్గిన ట్విట్టర్


భారత మ్యాపును తప్పుగా చూపించిన సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్‌ ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ప్రభుత్వం సహా దేశవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం కావడంతో మ్యాపును వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. జమ్మూ కశ్మీర్‌, లడఖ్‌ను భారత్‌ వెలుపల చూపుతూ ట్విట్టర్‌ తన వెబ్‌సైట్ ట్వీప్‌ లైఫ్‌ అనే సెక్షన్‌లో తప్పుడు మ్యాపును ఉంచింది. దీంతో ట్విట్టర్‌పై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం సైతం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. దేశ మ్యాపును తప్పుగా చూపించడం చట్టరీత్యా నేరమని.. దీనికి భారీ జరిమానాతో పాటు దేశంలోని సంస్థ అధికారులు జైలు శిక్ష కూడా అనుభవించే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలోనూ ఈ తరహా తప్పిదాలకు పాల్పడ్డ ట్విట్టర్‌ను ఈసారి గట్టిగానే హెచ్చరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. లేహ్ ప్రాంతాన్ని లడఖ్‌లో కాకుండా.. జమ్మూ కశ్మీర్ భూభాగంలో చూపించటంపై తీవ్రంగా పరిగణించిన కేంద్రం.. గతేడాది నవంబరులో ట్విట్టర్‌కు నోటీసులు జారీ చేసింది. చట్టపరంగా ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని, దీనిపై ఐదు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బీజేపీ సీనియర్‌ నేత మురళీధర్‌ రావు దీనిపై స్పందించారు. ‘గత కొద్ది నెలలుగా ట్విట్టర్‌ చర్యలు భారత ప్రయోజనాలు, మనోభావాల పట్ల వివక్ష చూపుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత చట్టాలను ట్విట్టర్‌ పాటించి తీరాల్సిందే’నని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకొచ్చి అమలుకు మొండికేస్తున్న ట్విట్టర్ ఇప్పటికే పలు మినహాయింపులు కోల్పోయింది. ఈ క్రమంలో కేంద్రం, ట్విట్టర్ మధ్య పోరు నడుస్తోంది. తాజా వివాదంతో మరింత చిక్కుల్లో పడింది. కశ్మీర్‌ను దేశంగా చూపిస్తూ రూపొందించిన మ్యాప్‌ను ట్విట్టర్ ట్వీప్ లైఫ్ విభాగంలో పొందుపరిచారు. దీన్ని ఓ నెటిజన్ గుర్తించడంతో ఈ తప్పిదం వెలుగులోకి వచ్చింది. ఈ అంశంపై నెటిజన్లు ట్విట్టర్‌ను ఏకిపారేస్తున్నారు.


By June 29, 2021 at 07:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/twitter-removed-from-its-website-a-wrong-map-of-india-amid-calls-for-action/articleshow/83941772.cms

No comments