Breaking News

పెళ్లి తర్వాత భార్య హిజ్ర అని తెలిసి.. షాక్ తిన్న భర్త


పెళ్లి చేసుకున్నాక భార్య భర్తల మధ్య అన్యోన్యం, శారీరక సంబంధం సాధారణం. కానీ ఓ భర్త పెళ్లై రెండు నెలలు అవుతున్నా కూడా భార్యతో శారీరక సంబంధం ఏర్పరచుకోలేకపోయాడు. దీంతో ఆమెను పరీక్షల నిమిత్తం డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు. దీంతో భార్యను పరీక్షించిన డాక్టర్ ఆమె హిజ్రా అని తెలిపింది. దీంతో షాక్ తిన్న భర్త.. భార్య తరపు బంధువులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో వెలుగుచూసింది. లింగమార్పిడి చేసి అమ్మాయి అని చెప్పి తనతో వివాహం జరిపించారని, మోసం చేసిన అత్తమామలపై కేసు పెట్టాలని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాన్పూర్ నగర నివాసి అయిన యువకుడు శాస్త్రినగర్ లోని పంకి ప్రాంతానికి చెందిన యువతిని ఏప్రిల్ 28వతేదీన వివాహమాడారు. వివాహం అనంతరం వరుడు వధువుతో శారీరక సంబంధం ఏర్పరచుకోలేక పోయాడు. తన భార్య లింగమార్పిడి చేయించుకుందని, ఆమె జననాంగాలు పూర్తిగా అభివృద్ధి చెందలేదని గుర్తించి ఆమెను వైద్య పరీక్ష కోసం గైనకాలజిస్టు వద్దకు తీసుకువెళ్లాడు. అయితే పరీక్షలు చేసిన డాక్టర్.. యువకుడి భార్య లింగమార్పిడి చేయించుకున్న హిజ్రా అని చెప్పింది. షాక్ గురైన భర్త అత్తమామలపై ఫిర్యాదు చేశారు. తన భార్య వైద్య నివేదికతో వధువు, ఆమె తల్లిదండ్రులు, వివాహ మధ్యవర్తిపై భర్త ఫిర్యాదు చేయడంతో వారిపై తాము ఐపీసీ సెక్షన్ 420 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అత్తమామలతో పాటు 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఇన్ స్పెక్టర్ చెప్పారు.


By June 23, 2021 at 08:47AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/2-months-after-marriage-man-learns-wife-is-transgender/articleshow/83767650.cms

No comments