Breaking News

Nagarjuna: యాంకర్ రష్మికి నాగార్జున బంపర్ ఆఫర్!


బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్ అనిపించుకున్న రష్మీ గౌతమ్.. వెండితెరపై ఆశించరీతిలో ఆకట్టుకోలేకపోయింది. నిజానికి 2002 నుంచి అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే ఉంది రష్మి. హీరోయిన్‌గానూ చాలా సినిమాల్లో నటించింది. వాటిలో గుంటూరు టాకీస్ చిత్రం కాసుల వర్షం కురిపించగా.. గ్లామర్ షోతో ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. ఆ తరువాత ‘అంతకు మంచి’, శివరంజని, నెక్స్ట్ నువ్వే, తను వచ్చెనంట, రాణి గారి బంగ్లా, ఇలా చాలా చిత్రాల్లో నటించినప్పటికీ హీరోయిన్‌గా సత్తా చూపించలేకపోయింది. అయితే ఈ హాట్ బ్యూటీకి టాలీవుడ్ మన్మథుడు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నాగ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రంలో రష్మీ ఓ కీలక పాత్ర చేయబోతున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌ పూర్తైంది.. అయితే లాక్ డౌన్ కారణంగా రెండో షెడ్యూల్‌కి బ్రేక్ పడింది. అయితే త్వరలో ప్రారంభం కాబోతున్న సెకండ్ షెడ్యూల్‌లో రష్మి జాయిన్ అవుతున్నట్టు సమాచారం. ‘గుంటూరు టాకీస్’ చిత్రంతో నటిగా రష్మికి గుర్తింపు తీసుకువచ్చిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు.. కింగ్ కాంబినేషన్ మూవీలో ఆమెను ఎలా చూపిస్తారన్నది ఆసక్తిగా మారింది. కాగా ఈ చిత్రంలో నాగార్జునకి జోడీగా కాజల్ నటిస్తుండగా.. శ్రీవేంకటేశ్వర ఎల్‌ఎల్‌పీ, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


By May 30, 2021 at 09:06AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anchor-rashmi-gautam-key-role-in-nagarjuna-and-praveen-sattaru-film/articleshow/83080730.cms

No comments