Breaking News

మోదీకి మద్దతు.. ‘జగన్ మీరు ఇప్పుడు సీఎం’ అంటూ కాంగ్రెస్ ఎంపీ చురకలు


కరోనా పరిస్థితులు, కట్టడికి తీసుకుంటున్న చర్యల గురించి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం జరిపిన ఫోన్ సంభాషణపై ఝార్ఖండ్ సీఎం ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే, హేమంత్ సోరేన్ ట్వీట్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఖండించడంతో తీవ్ర చర్చ జరుగుతోంది. మోదీకి మద్దతుగా ట్వీట్‌ చేయడాన్ని ఒడిశా నేత, కాంగ్రెస్‌ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలాకా ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా, ఝార్ఖండ్‌ సీఎంలు, పుదుచ్చేరి, జమ్ము, కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్లతో మోదీ గురువారం ఫోన్‌లో మాట్లాడారు. ఆ ఫోన్‌ సంభాషణ తర్వాత ఝర్ఖాండ్ సీఎం ‘గౌరవనీయ ప్రధాని ఫోన్‌ చేశారు. కేవలం ఆయన మనసులోని మాట (పరోక్షంగా మోదీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ) మాత్రమే చెప్పారు. దానికి బదులు పనికొచ్చే మాటలు చెప్పి, పనికొచ్చే మాటలు వింటే బాగుండేది’’ అని ట్వీట్‌ చేశారు. హేమంత్‌ ట్వీట్‌పై ఏపీ సీఎం జగన్‌ స్పందించారు. ‘‘ప్రియమైన హేమంత్‌ సోరెన్‌. మీరంటే నాకు చాలా గౌరవం ఉంది... మన మధ్య ఎన్ని విభేదాలన్నా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విమర్శలు సరికాదు.. అవి దేశాన్ని మరింత బలహీనపరుస్తాయి... ఓ సోదరుడిగా విజ్ఞ‌ప్తి చేస్తున్నా.. కొవిడ్‌పై చేస్తున్న ఈ పోరాటంలో వేలెత్తి చూపేందుకు ఇది తగిన సమయం కాదు.. అందరం కలిసికట్టుగా ప్రధాని మోదీకి మరింత మద్దతుగా నిలవాల్సిన తరుణం ఇది. మనందరం మోదీకి సంఘీభావం ప్రకటిస్తే ఆయన మహమ్మారిపై మరింత సమర్థంగా యుద్ధం చేయగలరు’ అని జగన్ హితబోధ చేశారు. జగన్‌ ట్వీట్‌పై ఒడిశాకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ సప్తగిరి ఉలాకా రీట్వీట్‌ చేశారు. ‘కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వంటి గొప్ప నెత కుమారుడివై ఉండి కూడా సీబీఐ, ఈడీ దాడులకు భయపడటం విచారకరం.. మీ రాజకీయ ప్రయోజనాల కోసం మోదీతో ఇలా లాలూచీ పడి భజన చేయడం సరికాదు. మీరు ఎదగాలి జగన్‌. ఇప్పుడు ముఖ్యమంత్రి మీరు’ అని విమర్శలు గుప్పించారు.


By May 08, 2021 at 09:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/odisha-congress-mp-saptagiri-ulaka-slams-ys-jagan-for-tweet-against-jharkhand-cm/articleshow/82474576.cms

No comments