Breaking News

కళ్లేదుటే ప్రాణాలు కోల్పోతున్న కోవిడ్ రోగులు.. నిరాశతో యువ డాక్టర్ ఆత్మహత్య


కరోనా వేళ వందలాది మందికి సేవలందించిన ఓ యువ వైద్యుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో రెసిడెంట్ వైద్యుడు వివేక్ రాయ్.. కోవిడ్ రెండో దశ వ్యాప్తి వేళ తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ చీఫ్ డాక్టర్ రవి వాంఖేడక్కర్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘‘ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన వివేక్ చాలా ప్రతిభావంతుడు.. మహమ్మారి వ్యాప్తి సమయంలో వందల మంది ప్రాణాలను రక్షించాడు’’ అని అన్నారు. గత నెల రోజులుగా ఆస్పత్రిలో కోవిడ్ రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కళ్లారా చూసిన వివేక.. తీవ్ర మనస్థాపానికి గురయ్యాడని వాంంఖేడ్కర్ అన్నారు. పరిస్థితి విషమంగా ఏడు నుంచి ఎనిమిది మంది కోవిడ్ రోగులకు రోజూ వివేక్ చికిత్స చేసేవాడని అన్నారు. చికిత్స సమయంలో పెద్ద సంఖ్యలో బాధితులు ఆస్పత్రిలో చనివపోడంతో డాక్టర్ వివేక్‌లో తీవ్ర నిరాశ అవహించిందని వాంఖేడ్కర్ తెలిపారు. ‘‘కోవిడ్ సంక్షోభాన్ని నిర్వహించేటప్పుడు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురిచేసింది. చెత్త రాజకీయాలు, చెత్త పాలనతో ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాల కొరత ఓ యువ వైద్యుడిలో నిరాశలో సృష్టించి అతడి మరణానికి కారణమయ్యింది’’ ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ వివేక్ రాయ్ మృతదేహాన్ని మాలవీయ నగర్‌లోని తన నివాసంలో స్వాధీనం చేసుకున్న పోలీసులకు.. అక్కడ ఓ సూసైడ్ నోట్ కూడా లభించింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఎయిమ్స్‌కు తరలించారు. దేశంలో కరోనా మరణాలు భారీ సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. గడిచిన రెండు వారాలుగా ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత వల్ల వందల కొద్దీ కోవిడ్ రోగుల ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ కొరత తమ కళ్ల ముందే బాధితులు గిలగిలా కొట్టుకుని ఊపిరి ఒదులుతుంటే వైద్యులు ఏమీ చేయలేని నిస్సాహాయులుగా చేష్టలుడిగిపోతున్నారు. ఈ సన్నివేశాలు వారిలో తీవ్ర నిరాశకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ వివేక్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.


By May 02, 2021 at 08:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/corona-crisiss-top-delhi-hospitals-covid-ward-doctor-dies-by-suicide/articleshow/82350816.cms

No comments