Breaking News

తుపాకీ కాల్పులు.. పరుగులు తీసిన ఎమ్మెల్యే


తుపాకుల మోతతో భయపడ్డ ఓ ఎమ్మెల్యే, అతని సిబ్బంది పాటు పరుగులు తీశారు. ఈ ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. నాగాలాండ్తో సరిహద్దుగా ఉన్న జోర్హాట్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అస్సాం కాంగ్రెస్ ఎమ్మెల్యే రూప్‌జ్యోతి కుర్మి, ఆయన భద్రతా సిబ్బంది అక్రమ పనులను పర్యవేక్షిస్తుండగా ఒక్కసారిగా బుల్లెట్ల శబ్దం వినిపించింది. దీంతో ఎమ్మెల్యే పరుగులు అందుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అస్సాం జిల్లాలైన చారిడియో, శివసాగర్, జోర్హాట్, గోలఘాట్, కర్బి అంగ్లాంగ్లు నాగాలాండ్‌తో సరిహద్దును కలిగివున్నాయి. ఈ సరిహద్దు ప్రాంతాల్లో నాగాలాండ్ దురాక్రమణలకు పాల్పడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో మరియాని ఎమ్మెల్యే రూప్జ్యోతి కుర్మి తన సిబ్బంది, కొందరు మీడియా ప్రతినిధులతో కలిసి దేసో వ్యాలీ రిజర్వ్ ఫారెస్ట్కు వెళ్లారు. అక్కడి ఆక్రమణలను పరిశీలిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలోతుపాకుల మోత వినిపించింది. తనను టార్గెట్ చేసే ఆ కాల్పులు జరిగాయని కుర్మి తెలిపారు. అయితే అదృష్టవశాత్తు తామంతా కాల్పుల నుంచి తప్పించుకున్నామన్నారు. సమస్యను పరిష్కరించేందుకు అస్సాం ప్రభుత్వం నాగాలాండ్ సర్కారుతో మాట్లాడటం లేదని కుర్మి ఆరోపించారు. ఈ కాల్పుల్లు ముగ్గురు రిపోర్టర్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్పందించారు. వెంటనే అక్కడి పరిస్థితులపై పరిశీలించాలని సీనియర్ పోలీసు అధికారి జీపీ సింగ్‌కు ఆదేశాలు జారీ చేశారు.


By May 28, 2021 at 12:08PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/assam-congress-mla-rupjyoti-kurmi-escape-from-gunfire-at-border/articleshow/83029255.cms

No comments