Breaking News

కరోనా రోగులపై ముఖ్యమంత్రి ఆగ్రహం.. ఆస్పత్రి నుంచి వెళ్లిపోవాలని ఆదేశం


కరోనా నుంచి కోలుకున్న వాళ్లు ఇళ్లకు వెళ్లకుండా ఆస్పత్రుల్లోనూ ఉంటున్నారు. దీంతో కొత్తగా వైరస్ సోకిన వారికి బెడ్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఏకంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నుంచి కోలుకున్న వారు వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని ఆదేశించారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి మంగళవారం బెంగళూరు శివాజీనగరలోని కోవిడ్‌ వార్‌ రూమ్‌లను తనిఖీ చేశారు. అక్కడ 20 రోజులుగా చికిత్స పొందిన వారిలో 503 మంది వైరస్ నుంచి కోలుకున్నా ఆస్పత్రిలోనే ఉంటున్నట్లు సీఎం దృష్టికి వచ్చింది. వారంతా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే ఆలోచనలో లేరని డాక్టర్లు చెప్పడంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బెడ్ల కొరత ఉండడంతో కోలుకున్న వెంటనే ఆసుపత్రి నుంచి వెళ్లిపోవాలని యడియూరప్ప సూచించారు. టీకాలు వచ్చిన తక్షణమే అందరికీ వేయిస్తామని, గందరగోళం సృష్టించొద్దని విజ్ఞప్తి చేశారు.


By May 12, 2021 at 12:05PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-chief-minister-yeddyurappa-fires-on-corona-patients/articleshow/82568745.cms

No comments