Breaking News

కోలీవుడ్‌లో కరోనా కలకలం.. ‘అసురన్’ నటుడు ఇకలేరు


ప్రస్తుతం మన దేశంలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే. రోజురోజుకూ మరణాలు సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక సినీ ఇండస్ట్రీలోనూ కరోనా మరణాలు ఎక్కువ అవుతున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ కోలీవుడ్ అనే తేడా లేకుండా సెలెబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇందులో చాలా మంది ప్రాణాలను కోల్పోతోన్నారు. తాజాగా కోలీవుడ్‌లో వరుసగా కరోనాకు బలి అవుతున్నారు. నేటి ఉదయం పాటల రచయిత, సింగర్, నటుడు దర్శఖుడు అరుణ్ రాజా కామరాజ్ భార్య సింధూజ కరోనాతో మరణించారు. తాజాగా మరో నటుడు మరణంతో కోలీవుడ్ విషాదంలో మునిగింది. సినిమాలో నటించిన నితీష్ వీర(45) కోవిడ్‌తో తాజాగా మరణించారు. అసురన్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్‌లో విలన్‌గా కనిపించిన కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. సెల్వ రాఘవన్ తెరకెక్కించిన పుదుపెట్టై సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. నితీష్ వీర మరణంతో సెల్వ రాఘవన్ విషాదంలో మునిగారు. నా మని ఆత్మకు శాంతి చేకూరాలి అని నాటి పాత్రను గుర్తు చేసుకున్నారు. ఇక అసురన్ నటి అభిరామి స్పందిస్తూ.. నితీష్ అన్న మరణంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాను.. ఎంతో అద్భుతమైన నటుడు.. ఇది ఎప్పుడూ ఊహించలేదు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని పోస్ట్ చేశారు. ఇక ఈయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.


By May 17, 2021 at 10:19AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/asuran-fame-nitish-veera-passes-away-due-to-covid-19/articleshow/82699734.cms

No comments