Breaking News

వ్యాక్సిన్‌పై కొత్త మార్గదర్శకాలు.. కోవిడ్ సోకినవారికి మూడు నెల తర్వాతే టీకా


దేశంలో వ్యాక్సినేషన్ ప్రకియపై కేంద్రం మరోసారి మార్గదర్శకాలను సవరించింది. కోవిడ్ సోకిన వ్యక్తులు ఎన్ని రోజుల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలనేది తాజాగా బుధవారం వెలువరించిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు వ్యాక్సిన్‌ కోసం కనీసం మూడు నెలలు ఆగాలని సూచించింది. అలాగే, తొలిడోస్ తీసుకున్నవారు వైరస్‌ బారినపడితే కోలుకున్నప్పటి నుంచి మూడు నెలల తర్వాత రెండో డోస్ వేసుకోవాలని తెలిపింది. గతంలో ఈ వ్యవధి నాలుగు నుంచి ఎనిమిది వారాలు ఉండగా... తాజాగా మూడు నెలలకు పెంచారు. అలాగే, వ్యాక్సిన్‌ తీసుకున్న వాళ్లు 14 రోజుల తర్వాత.. కొవిడ్‌ నుంచి కోలుకున్న వాళ్లు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకుని, అందులో నెగెటివ్‌ వచ్చిన తర్వాత రెండు వారాల తర్వాత రక్తం దానం చేయొచ్చని తెలిపింది. అంతేకాదు, బాలింతలు కూడా నిరభ్యంతరంగా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని పేర్కొంది. గర్భిణులకు వ్యాక్సినేషన్‌ అంశంపౌ అధ్యయనం జరుగుతోందని, ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర ఆరోగ్య శాక వెల్లడించింది. బాలింతలు, గర్బిణీలకు వ్యాక్సిన్ వల్ల ఏమైనా దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉందని ఇప్పటి వరకూ వారిని వ్యాక్సినేషన్ ప్రక్రియలో చేర్చలేదు. కానీ, ప్రస్తుతం బాలింతలకు టీకాను సిఫార్సు చేశారు. నేషనల్‌ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టీఏజీఐ) ఇటీవల చేసిన ప్రతిపాదనల మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ మార్గదర్శకాలకు ఆమోదం తెలిపింది. ప్లాస్మా చికిత్స చేయించుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన మూడు నెలల తర్వాత టీకా తీసుకోవాలని, ఇతర వ్యాధులకు ఐసీయూలో చికిత్స తీసుకుని కోలుకున్నవారు 4-8 వారాల తర్వాతే టీకా వేసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అంతేకాదు, వ్యాక్సినేషన్‌కు ముందు ఎలాంటి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలూ అవసరం లేదని తేల్చి చెప్పింది. క్లినికల్ ట్రయల్స్ డేటా వ్యాక్సినేషన్‌ మార్గదర్శకాల్లో తీసుకొచ్చిన ఈ తాజా మార్పులను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలూ పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించింది.


By May 20, 2021 at 08:56AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/centre-issues-new-guidelines-for-vaccination-thing-you-should-know/articleshow/82789337.cms

No comments