Breaking News

'పెళ్లి సందడి' సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కన్నుమూత


మహమ్మారి కరోనా వైరస్ సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు నింపుతోంది. కోవిడ్ సోకి ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు మృతి చెందగా.. నేటి (మే 21) తెల్లవారు జామున సీనియర్ మోస్ట్ కరోనాతో కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగులో నందమూరి తారక రామారావు, కృష్ణ, అక్కినేని నాగేశ్వర రావు, చిరంజీవి, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకు అలాగే మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి లాంటి హీరోల సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసి మంచి గుర్తింపు తెచుకున్నారు జయరాం. అటు మలయాళం, ఇటు తెలుగు సినిమా రంగంలోనూ సినిమాటోగ్రాఫర్‌గా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అనేక సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆయన సినిమాటోగ్రఫీలోనే ‘పెళ్లి సందడి’ చిత్రం రూపొందింది. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. జయరాం మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


By May 21, 2021 at 07:55AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/famous-cinematographer-v-jayaram-passes-away-due-to-corona/articleshow/82819430.cms

No comments