Breaking News

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడి భార్య మరణం


ప్రస్తుతం మన దేశం కరోనా వైరస్ ధాటికి అల్లకల్లోలం అవుతోంది. సెకండ్ వేవ్ దెబ్బకు దేశం మొత్తం కుదేలవుతోంది. రోజుకు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి.. వేల మంది ప్రాణాలు కోల్పోతోన్నారు. ఓ వైపు వ్యాక్సిన్ కొరత, వైద్య సదుపాయాలు సరిగ్గా లేక, ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు వదులుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ సినీ ఇండస్ట్రీపై గట్టి ప్రభావమే చూపుతోంది. కరోనాతో సినీ ప్రముఖులు మృతి చెందుతున్నారు. తాజాగా కోలీవుడ్ డైరెక్టర్, లిరిసిస్ట్, నటుడు అరుణ్ రాజా కామా రాజ్ భార్య కరోనాతో మృతి చెందారు. పిజ్జా సినిమాతో పాటల రచయితగా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టేశారు అరుణ్ రాజా కామా రాజ్. ఆ తరువాత రాజా రాణి సినిమాతో నటుడిగా మరో అవతారం ఎత్తేశారు. ఆ తరువాత సినిమాతో కోలీవుడ్ మొత్తాన్ని ఆకట్టుకున్నారు. ఐశ్వర్యా రాజేష్, శివ కార్తికేయన్ కాంబినేషన్‌లో వచ్చిన కణా (తెలుగులో కౌసల్యా కృష్ణమూర్తి)తో దర్శకుడిగా అందరి దృష్ణిని ఆకర్షించారు. అలాంటి దర్శకుడి ఇంట్లో కరోనా విషాదాన్ని మిగిల్చింది. అరుణ్ రాజా భార్య సింధూజ గత కొన్ని రోజులు క్రితం కరోనా బారిన పడ్డారు. అయితే పరిస్థితి విషమించడంతో నేటి ఉదయం ఆమె కన్నుమూశారు. కరోనా తీవ్రతరం కావడం, వైద్యానికి స్పందించలేదని తెలుస్తోంది. అరుణ్ రాజా భార్య మృతితో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కోలీవుడ్ ప్రముఖులు అరుణ్ రాజాకు ధైర్యాన్ని చెబుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఆయన భార్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.


By May 17, 2021 at 08:08AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/arunraja-kamaraj-wife-sindhuja-passed-away-due-to-covid-19/articleshow/82697606.cms

No comments