Breaking News

అత్తింటికి షాకిచ్చిన కొత్తకోడలు.. తెల్లారి లేచేసరికి ఇల్లంతా గుల్ల


పెళ్లి జరిగిన మూడు వారాలకే అత్తింటి వారికి దిమ్మతిరిగే షాకిచ్చిందో వధువు. కట్టుకున్న భర్తకు, అత్తింటివారికి మత్తుమందు ఇచ్చి పట్టుచీరలు, బంగారు నగలతో పరారైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాహ్ సిటీలో గురువారం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. బాహ్ సిటీకి చెందిన ఉపేంద్ర (22)కు శాలిని(20) అనే యువతితో ఈ నెల 7వ తేదీన వివాహం జరిగింది. పెళ్లయిన వెంటనే శాలిని భర్తతో పాటు అత్తమామలు, బంధువులతో బాగా కలిసిపోయింది. దీంతో మంచి కోడలు వచ్చిందని అత్తింటివారు తెగ మురిసిపోయారు. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి భర్త, అత్తమామలకు శాలిని మత్తమందు కలిపిన పాలు ఇచ్చింది. వారంతా మత్తులోకి జారుకోగానే ఇంట్లో విలువైన నగలు, పట్టుచీరలు తీసుకుని పరారైంది. మంగళవారం ఉదయం నిద్రలేచేసరికి శాలిని ఇంట్లో కనిపించకపోవడంతో అత్తింటివారు కంగారు పడ్డారు. ఆమె కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించగా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో అనుమానం వచ్చిన బీరువా తెరిచి చూడగా విలువైన ఆభరణాలు, పట్టుచీరలు కనిపించలేదు. దీంతో కొత్త కోడలే ఈ పనికి పాల్పడిందని నిర్ధారణకు వచ్చిన ఉపేంద్ర కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శాలినిపై కేసు నమోదు చేసి ఆమె కోసం గాలిస్తున్నారు.


By May 28, 2021 at 08:14AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/newly-married-woman-eloped-with-jewellery-from-husband-house-in-uttar-pradesh/articleshow/83025264.cms

No comments