Breaking News

కేరళలో సంపూర్ణ లాక్‌డౌన్.. మే 8 నుంచి అమల్లోకి


కేరళలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. నమోదవుతున్నాయి. దేశంలో కేసులు అత్యధికంగా పెరుగుతున్న 24 రాష్ట్రాల్లో కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లు మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అక్కడ దాదాపు 42 వేల కేసులు నమోదుకాగా.. 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మే 8 నుంచి 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్టు సీఎం విజయన్ గురువారం ఉదయం ప్రకటించారు. మే 8 ఉదయం 6 నుంచి మే 16 రాత్రి 9 గంటలకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని తెలిపారు. రెండో దశలో మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించినట్టు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించారు. లాక్‌డౌన్ సమయంలో అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుంది. నిత్యవసర దుకాణాలకు అనుమతించినా.. వీటిని ప్రత్యేక సమయంలో తెరవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన విధి విధానాలను వెల్లడించనున్నారు. కరోనా కట్టడికి చాలా రాష్ట్రాలు పాక్షిక లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు అమలు చేస్తున్నాయి. అయితే, మినీ లాక్‌డౌన్‌ల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని ఇటీవల నిపుణుల కమిటీ కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా సంపూర్ణ లాక్‌డౌన్‌కు పినరయ్ విజయన్ మొగ్గచూపారు. కేరళలో పాక్షిక లాక్‌డౌన్, కఠిన ఆంక్షలు విధించినా మహమ్మారి మాత్రం అదుపులోకి రాలేదు. కఠిన చర్యలు తీసుకున్నా ప్రజలు మాత్రం నిబంధనలు పాటించడంలేదు. దేశ వ్యాప్తంగా గత రెండు వారాల వ్యవధిలో అత్యధిక వేగంగా కరోనా విస్తరిస్తున్న 30 జిల్లాల జాబితాలో 10 జిల్లాలతో కేరళ తొలిస్థానంలో ఉందిరోజు రోజుకూ పట్టణ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా నిర్ణయం తీసుకున్నారు.


By May 06, 2021 at 11:59AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kerala-annouses-enforce-lockdown-from-may-8-to-16-amid-rising-covid-cases/articleshow/82426248.cms

No comments