Breaking News

Covishield: రేటు ఫిక్స్ చేసిన సీరం.. ప్రైవేటుకి అదనం


దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాయి. కరోనా వ్యాక్సిన్ పంపిణీలో విమర్శలు రావడంతో టీకా కొరతను తీర్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజల కిందట ప్రధాని మోదీ నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విధానంపై కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి వ్యాక్సిన్ కంపెనీలు సగం డోసులను కేంద్రానికి, మిగిలిన డోసులను రాష్ట్ర ప్రభుత్వాలకు, ఓపెన్ మార్కెట్‌లో విక్రయించుకునేందుకు అనుమతినిచ్చింది. రాష్ట్రాల డిమాండ్‌కి తగినట్లుగా నేరుగా కొనుగోలు చేసుకునే వీలు కల్పించింది. కేంద్రం తాజా నిర్ణయం మేరకు అతిపెద్ద వ్యాక్సిన తయారీ సంస్థ సీరం తన కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్‌కి రేటు ఫిక్స్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక రేటు, ప్రైవేటు ఆస్పత్రులు.. ఓపెన్ మార్కెట్‌లో విక్రయాలకు ధరలను నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక డోసు రూ.400, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.600 చొప్పున విక్రయించనున్నట్లు ప్రకటించింది. మరో నాలుగైదు నెలల్లో రిటైల్ మార్కెట్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. కేంద్రానికి రూ.150లకు సీరం వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తోంది. Also Read:


By April 21, 2021 at 03:11PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/serum-institute-fixes-price-for-covid-vaccine-covishield/articleshow/82178462.cms

No comments