Breaking News

బరిలో బ్యూటీక్వీన్.. పంచాయతీకి అందాల భామ పోటీ


ఎంతోమంది సినీతారలు.. నటులు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పలువురు హీరోలు, హీరోయిన్లు ప్రజామోదంతో చట్టసభల్లోకి ఎంట్రీ ఇచ్చారు కూడా. ఇప్పుడదే వరసలో చేరిపోయిందో అందాలరాశి. మోడల్‌గా కొనసాగుతున్న సొంత రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ ఎన్నికల బరిలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. మిస్ ఇండియా అందాల పోటీల్లో ఫైనల్ దాకా వెళ్లిన దీక్షా యూపీలోని జాన్‌పూర్ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో పోటీకి దిగారు. బక్షా ఏరియా చిట్టోరి గ్రామానికి చెందిన దీక్షా సింగ్ చిన్నతనంలో అక్కడే పెరిగింది. ఆ తరువాత తండ్రి వ్యాపార రీత్యా ముంబై, అక్కడి నుంచి గోవాలో స్థిరపడింది. మోడల్‌గా ఎదిగిన దీక్షా.. 2015 మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా మెరిసింది. ఆమె అనూహ్యంగా పంచాయతీ ఎన్నికల బరిలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. బక్షా డెవెలప్‌మెంట్ బ్లాక్‌లోని వార్డు నంబర్ 26 నుంచి దీక్షా బరిలోకి దిగారు. ఆమె బీజేపీ అభ్యర్థి షాలినీ సింగ్‌పై పోటీ చేస్తున్నారు. తండ్రి కోరిక మేరకు ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వార్డు నెంబర్ 26 నుంచి పోటీ చేసేందుకు దీక్షా తండ్రి జితేంద్ర సింగ్ సిద్ధమయ్యారు. చివరి క్షణంలో ఆ స్థానం మహిళకు రిజర్వ్ కావడంతో తన కూతురు దీక్షా సింగ్‌ని బరిలోకి దించారు. తండ్రి కోరిక మేరకు అందార భామ దీక్షా పంచాయతీ పోరుకి సిద్ధమయ్యారు. ఈ నెల 15 నుంచి యూపీలో నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. Also Read:


By April 03, 2021 at 03:13PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/beauty-queen-diksha-singh-contesting-in-uttar-pradesh-panchayat-election/articleshow/81885990.cms

No comments