Breaking News

బీజాపూర్‌లొ మావోయిస్టుల ఘాతకం.. ఏఎస్సై దారుణ హత్య


భద్రతా దళాలపై దాడి చేసి 23 మందిని హతమార్చిన దారుణ ఘటన మరువక ముందే ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరో దుశ్యర్యకు పాల్పడ్డారు. మూడు రోజుల కిందట మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ఏఎస్సై మురళిని అతికిరాతకంగా హత్య చేశారు. ప్రజాకోర్టు నిర్వహించి అతన్ని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలనార్ గ్రామంలో ఏఎస్సై తాటి మురళిని ఈ నెల 21న మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. పలనార్ గ్రామంలోని ఇంటికి వచ్చిన మురళిని మావోయిస్టులు అపహరించారు. మూడు రోజులుగా బంధీగా ఉంచిన మావోయిస్టులు అతన్ని దారుణంగా చంపేశారు. శవాన్ని గంగళూరు వద్ద పడేశారు. అతని డెడ్‌బాడీ పక్కనే మావోయిస్టులు ఓ లేఖ ఉంచి వెళ్లారు. సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో రాసిన లేఖలో తాటి మురళికి ప్రజాకోర్టులో శిక్ష విధించినట్లుగా రాసి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల ఏప్రిల్ 5న జరిగిన మావోయిస్టుల దాడిలో 23 మంది భద్రతా దళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కోబ్రా కమాండర్ రాకేష్ సింగ్ మిన్హాస్‌ని మావోయిస్టులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. చర్చల అనంతరం బంధీగా ఉన్న రాకేష్ సింగ్‌ని విడుదల చేశారు. Also Read:


By April 24, 2021 at 03:02PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cop-murdered-by-maoists-who-abducted-in-bijapur-of-chhattisgarh/articleshow/82230167.cms

No comments