Breaking News

లాక్‌డౌన్ విమానాల టికెట్లు రిఫండ్.. ఎయిర్‌లైన్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు!


గతేడాది కరోనా వైరస్ కట్టడికి విధించిన సమయంలో రద్దయిన విమానాల టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బులు వాపసు చేయాలని ఎయిర్‌లైన్స్‌కు పౌర విమానయాన శాఖ ఆదేశించింది. ఇదే విషయమై పౌర విమానయాన శాఖకు ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. లాక్‌డౌన్ సమయంలో రద్దయిన విమానాలకు సంబంధించిన ప్రయాణికులకు మార్చి 31లోగా నగదు తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ లోపు ప్రయాణికులకు చెల్లింపులు జరగాలని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలతో గో ఎయిర్, ఇండిగో ఎయిర్‌లైన్స్ టిక్కెట్ డబ్బులను ప్రయాణికులకు తిరిగి చెల్లించాయి. కానీ, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఆసియా, విస్తారా ఇంకా రిఫండ్ చేయలేదు. ఈ నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సెక్రెటరీ విమానయాన సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. లాక్‌డౌన్ సమయంలో రద్దు అయిన విమానాలకు సంబంధించిన డబ్బులను వెంటనే ప్రయాణికులకు చెల్లించాలని ఆదేశించారు. ఇంత వరకు చెల్లించకపోవడంపై కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘లాక్‌డౌన్ సమయంలో రద్దయిన విమానాల టిక్కెట్లు రిఫండ్ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చెల్లించడం జరుగుతుంది.. కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం. పెండింగ్‌లో ఉన్న పిఎన్‌ఆర్‌ల వివరాలను అందజేయాలని’’ తన ప్రయాణ భాగస్వాములు, ఏజెంట్లకు స్పైస్ జెట్ మార్చి 2021లో లేఖ రాసింది. ఎయిరిండియా సైతం 5.20 లక్షల మంది ప్రయాణికులకు రూ.2,000 కోట్లు చెల్లించడానికి సిద్ధమయ్యింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రూ.1,000 కోట్ల చెల్లించామని ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు.


By April 13, 2021 at 12:18PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/refund-passengers-who-cancelled-flights-in-lockdown-last-year-govt-to-airlines/articleshow/82045435.cms

No comments