Breaking News

మీ పనితీరేంటో మాకు తెలుసు.. ఆ కేసులో కేంద్రానికి సుప్రీంకోర్టు అక్షింతలు


ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇటలీ నేవీ అధికారులపై కేసును కొట్టివేయాలంటూ కేంద్రం చేసిన విజ్ఞప్తిపై విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. మత్య్సకారుల కుటుంబాలకు రూ. 10 కోట్లు నష్ట పరిహారం చెల్లిస్తే ఈ కేసును మూసివేస్తామని గతంలో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, పది రోజుల్లోగా ఆ ప్రక్రియను పూర్తిచేయాలని ఏప్రిల్ 9న ఆదేశించింది. అనంతరం ఏప్రిల్ 19న కేసు పూర్తిచేస్తామని స్పష్టం చేసింది. కానీ, ఏప్రిల్ 19 నాటికి ఈ ప్రక్రియ పూర్తికాకపోవడంతో న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నష్టపరిహారం ఇంకా తమకు అందలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో కేసును వచ్చేవారానికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ‘‘ఈ కేసులో తొందరగా విచారణ పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వ కౌన్సిల్ కోరింది. చివరి రోజుకు వచ్చే సరికి నష్టపరిహారం మరో మూడు రోజుల్లో డిపాజిట్ అవుతుందని చెప్పింది. మీరు ఎంత త్వరగా పనిచేస్తారో మాకు తెలుసు’ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం మండిపడింది. పరిహారాన్ని విదేశాంగ శాఖ వద్ద డిపాజిట్ చేయాలని ధర్మాసనం ఏప్రిల్ 9న సూచించింది. పరిహారం ఇచ్చేందుకు ఇటలీ అంగీకరించిందని సుప్రీంకోర్టుకు కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా తెలియజేశారు. హత్యకు గురైన ఇద్దరు జాలర్లకు రూ. 4 కోట్లు చొప్పున, బోటు యజమానికి రూ. 2 కోట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ పరిహారానికి బాధిత కుటుంబాలు కూడా అంగీకరించినట్టు తెలిపారు. కానీ, ఇంత వరకు ఎటువంటి నగదు అందలేదని బాధితుల తరఫున హాజరైన న్యాయవాది ఉన్నికృష్ణన్ కోర్టు తెలిపారు. ఇక, 2012 నాటి కేరళ మత్స్యకారుల హత్య కేసులో ఇటలీ నౌకాదళానికి చెందిన సల్వేటోర్ గైరోనే, మాస్సి‌మిలియనో లాటోర్రేలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటలీ నావికులపై మోపిన కొన్ని అభియోగాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో వారికి మరణశిక్ష తప్పింది.


By April 20, 2021 at 09:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-takes-a-jab-at-centre-in-italian-marines-case-hearing/articleshow/82156279.cms

No comments