Breaking News

ఎస్ఐపై చీటింగ్ కేసు పెట్టిన సినీనటి.. విచారణలో దిమ్మతిరిగే నిజాలు


పెళ్లి పేరుతో తనను వాడుకుని మోసం చేశాడంటూ ఓ ఎస్ఐపై తమిళ నటి రాధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుందరం ట్రావెల్స్ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన రాధ(38) పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. భర్తతో విడాకుల అనంతరం తల్లి, కుమారుడితో కలిసి శాలి గ్రామంలోని లోకయ్య వీధిలో నివాసముంటున్న రాధ.. ఎస్ఐ వసంత్ రాజ్‌పై గురువారం విరుగ్గంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ఆర్‌కేపురం పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉండే తిరువాన్మియూరు ఎస్‌ఐ వసంత్‌ రాజ్‌తో రాధకు ఓ సినిమా షూటింగ్‌ సందర్భంలో పరిచయం ఏర్పడింది. అప్పటికే ఆమె భర్తతో విడాకులు తీసుకున్నారు. వసంత్‌రాజ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఈ విషయం తెలిసి కూడా రాధ ఆయనతో ప్రేమలో పడింది. వసంత్‌రాజ్ తన కుటుంబాన్ని పట్టించుకోకుండా ప్రియురాలితోనే ఎక్కువ సమయం గడిపేవాడు. వీరి వ్యవహారం తెలుసుకున్న వసంత్‌రాజ్ భార్య గతంలోనే తిరువాన్మీయూరు సీఐకి ఫిర్యాదు చేసింది. రాధ మోజులో పడిన వసంత్‌ రాజ్ ఆమె కోసమని తిరువాన్మీయూరు నుంచి వడపళనికి పీఎస్‌కు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఆమెను రహస్యంగా వివాహం చేసుకుని కాపురం చేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో రాధ ఆధార్ కార్డులో వసంత్‌రాజ్‌ను భర్తగా, తన కొడుక్కి తండ్రిగా పేర్కొంటూ మార్పులు చేయించింది. ఈ విషయం తెలుసుకున్న వసంత్‌ రాజ్ ఆమెతో గొడవపడ్డాడు. రాధ దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఎన్నూరుకు బదిలీ చేయించుకుని వెళ్లిపోయాడు. దీంతో రాధ అక్కడికి వెళ్లి గొడవపడినట్లు సమాచారం. తనకు దూరంగా ఉండాలని, లేకపోతే పోలీస్ పవర్ చూపించాల్సి వస్తుందని వసంత్ రాజ్ ఆమెను బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో అతడిపై రాధ గురువారం విరుగ్గంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది.


By April 16, 2021 at 08:15AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/sundhara-travels-actress-radha-complaint-against-police-sub-inspector/articleshow/82094785.cms

No comments