Breaking News

భర్త మెడపై భార్య పాదం.. ఊహించని విషాదం


మద్యం తాగి ఇంటికొచ్చిన భర్త.. భార్యతో గొడవకు దిగాడు. అమాంతం వెనక్కి నెట్టేయడంతో భార్య కోపం కట్టలు తెంచుకుంది. అదే ఆవేశంతో భర్తను వెనక్కి తోసేయడంతో కిందపడిపోయాడు. ఆగ్రహంతో భర్త గొంతుపై కాలేసింది. కొద్దిసేపటికి ఆయన కదలకుండా పడిపోవడంతో కంగారుపడి చుట్టుపక్కల వారి సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పడంతో హతాశురాలైంది. తాను హంతకురాలు కావడంతోపాటు ముగ్గురు పిల్లలను అనాథను చేసింది. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలో జరిగింది. బెంగళూరులోని జేజే నగర్‌కి చెందిన మోహన్, పద్మ దంపతులు. పదహారేళ్ల కిందట వారికి వివాహమైంది. ముగ్గురు పిల్లలు సంతానం. మున్సిపల్ కార్పొరేషన్‌(బీబీఎంపీ)లో మోహన్ చెత్త ట్రక్కు డ్రైవర్‌గా పనిచేసేవాడు. మద్యానికి బానిస కావడంతో గతంలో రీహ్యాబిలిటేషన్ సెంటర్‌కి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం కొద్దినెలలు మద్యం మానేసిన మోహన్.. మళ్లీ తాగడం మొదలుపెట్టాడు. నిత్యం మద్యం తాగొచ్చి భార్యతో గొడవపడేవాడు. రెండు రోజుల కిందట మరోమారు మద్యం తాగి ఇంటికొచ్చి తెల్లవారుజామున 3.00 గంటల సమయంలో భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో భార్యను అమాంతం తోసేశాడు. ఆగ్రహానికి గురైన భార్య మోహన్‌ని నెట్టేసింది. తాగిన మైకంలో ఉన్న భర్త నేలపై పడిపోయాడు. కోపంతో ఊగిపోయిన పద్మ.. భర్త గొంతుపై కాలేసి తొక్కేసింది. కొద్దిసేపటికి ఆవేశం తగ్గి ఆమె కాలు తీసినా మోహన్ చలనం లేకుండా పడిపోయి ఉన్నాడు. భర్త అపస్మార స్థితికి చేరుకోవడంతో కంగారుపడిన భార్య వెంటనే చుట్టుపక్కల స్థానికులను ఆప్రమత్తం చేసింది. స్థానికుల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే ఆయన మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించడంతో కంగుతింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. భర్త గొంతుపై కాలేసి తొక్కి చంపేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By April 14, 2021 at 03:43PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bengaluru-woman-kills-drunkard-husband-with-her-foot/articleshow/82065213.cms

No comments