Breaking News

కొత్తగా ట్రిపుల్ మ్యుటెంట్.. మరింత ప్రమాదకరం: ఆ రాష్ట్రంలో గుర్తించిన శాస్త్రవేత్తలు


కోవిడ్ రెండో దశ వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. పాజిటివ్ కేసులు, మరణాల్లో రోజు రోజుకూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. దేశంలో వైరస్ మ్యుటేషన్ కొత్త పుంతలు తొక్కుతోంది. మహమ్మారి జన్యుమార్పిడి చెందుతుండటం.. కొన్ని స్ట్రెయిన్ల వల్లే వ్యాప్తి అధికంగా ఉంటోందని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో ఇప్పటికే డబుల్‌ మ్యుటెంట్‌ వైరస్‌ వ్యాప్తితో కొన్ని రాష్ట్రాలు కలవరపడుతున్నాయి. తాజాగా, ట్రిపుల్‌ మ్యుటెంట్‌‌ వైరస్ గుర్తించడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ప్రత్యేకమైన జన్యువుతో, రోగనిరోధక శక్తిని దాటుకుని చొచ్చుకుపోయే కొత్త స్ట్రెయిన్‌ B.1.618 రకం వైరస్‌ పశ్చిమ బెంగాల్‌లో వ్యాప్తిలో ఉందని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. ప్రస్తుతం రోజువారీ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న మహారాష్ట్ర, ఢిల్లీ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఇండియన్‌ వేరియంట్‌గా చెప్పుకొనే డబుల్‌ మ్యుటెంట్‌ B.1.617 ఎక్కువ వ్యాప్తిలో ఉంది. రోగనిరోధక శక్తిని దాటుకుని చొచ్చుకుపోయే సామర్థ్యం ఉండడం వల్ల ఇది ఎక్కువ వ్యాప్తికి కారణమవుతున్నట్లు అంచనా వేస్తున్నారు. వ్యాధి కారక కీలక స్పైక్‌ ప్రొటీన్‌ భాగంలో E484Q, L452R రెండు స్ట్రెయిన్‌లు కలిసి ఏర్పడటంతో డబుల్‌ మ్యుటెంట్‌ అంటున్నారు. E484Q స్ట్రెయిన్ యూకే, దక్షిణాఫ్రికా నుంచి, L452R స్ట్రెయిన్ అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి వ్యాపించాయి. ఈ రెండూ కలిసి దేశీయంగా డబుల్‌ మ్యుటెంట్‌ ఏర్పడిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది శరీర కణాలతో ఎక్కువగా అతుక్కుపోయే, రోగనిరోధక శక్తిని దాటుకుని చొచ్చుకుపోయే సామర్థ్యం కలిగి ఉందని అంటున్నారు. తాజాగా బెంగాల్‌లో గుర్తించిన ట్రిపుల్‌ మ్యుటెంట్‌ B.1.618 రకం స్ట్రెయిన్‌ స్పైక్‌ ప్రొటీన్‌లో E484Q, D614G రకాలు కలిగి ఉండటం వల్ల కొత్త లక్షణాలతో వ్యాప్తి సామర్థ్యాలు పెరగడానికి దోహదం చేస్తున్నాయని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ జినోమిక్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ (ఐజీఐబీ) శాస్త్రవేత్త వినోద్‌ స్కారియా తెలిపారు. ఇది మరింత వేగంగా వ్యాపించగల రకం అని ఆయన పేర్కొన్నారు. అయితే, దీనిపై మరింత విస్తృత పరిశోధన నిర్వహించాల్సి ఉందని అన్నారు. గతేడాది అక్టోబరు 25న బెంగాల్ స్ట్రెయిన్‌ను ఓ బాధితుడిలో తొలిసారి గుర్తించగా.. ఈ జనవరి నాటికి ఇది చాలా పెద్ద సంఖ్యలో పెరిగినట్టు కనుగొన్నారు. B.1.618 అనేది దేశవ్యాప్తంగా గత రెండు నెలల నుంచి వ్యాప్తిలో ఉన్న మూడో అత్యంత సాధారణ వేరియంట్.. దేశంలో దాదాపు 12 శాతం కేసులకు ఇది కారణమైంది. డబుల్ మ్యుటేంట్ B.1.617, 28 శాతం, యూకే వేరియంట్ B.1.1.7 తర్వాత స్థానంలో ఉన్నాయి. ‘‘ఇటీవలి నెలల్లో దేశంలోని కొన్ని ప్రాంతాలలో ‘డబుల్ మ్యుటెంట్’ స్ట్రెయిన్ వ్యాప్తిలో ఉంది.. ఇది ఇప్పుడు స్థిరపడిన D614G మ్యుటేషన్‌ను కలిగి ఉంది దీనిని 'మొదటి వేరియంట్' అని పిలుస్తారు.. ఇది చైనాలోని వుహాన్‌లో తొలుత గుర్తించారు.. దీనిని E484K మ్యుటేషన్ అని పిలుస్తారు’’ ఐజీబీఎం అసోసియేట్ ప్రొఫెసర్ చిన్నస్వామి తెలిపారు.


By April 22, 2021 at 07:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/triple-mutant-bengal-strain-a-new-worry-in-second-wave-in-india/articleshow/82190563.cms

No comments