Breaking News

మహారాష్ట్రలో పూర్తిస్థాయి లాక్‌డౌన్?.. నేడు కీలక ప్రకటన


కరోనా మహమ్మారి ధాటికి వణికిపోతోన్న కఠిన చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్షించిన మంత్రివర్గం... పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు మొగ్గు చూపినట్లు సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే బుధవారం ప్రకటన చేయనున్నారని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. కరోనా వైరస్‌ ఉధృతి దృష్ట్యా పదో తరగతి పరీక్షలు రద్దు చేసేందుకు రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. అంతేకాకుండా ఆసుపత్రుల్లో సరిపడా ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచేందుకు పలు చర్యలు చేపట్టామని మంత్రి చెప్పారు. ముఖ్యంగా పవర్‌ప్లాంట్లు తయారు చేసే ఆక్సిజన్‌ను వినియోగించుకోవాలని నిర్ణయించామని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌ తోప్ వెల్లడించారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మహారాష్ట్రలో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ, పగటిపూట 144 సెక్షన్‌, వీకెండ్‌లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ వంటి ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయినప్పటికీ చాలా మంది ప్రజలు నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కఠినమైన లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు కేబినెట్ మొగ్గుచూపిందని రాజేష్ తోప్‌ తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ లభ్యతపై ఆయన స్పందిస్తూ... రోజూ 1550 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ నిర్వహణను చేపట్టామని తెలిపారు. ప్రతి జిల్లాలోనూ ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, ఆక్సిజన్‌ సరఫరా చేసే వాహనాలకు అంబులెన్స్‌ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.


By April 21, 2021 at 09:57AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/lockdown-may-impliment-in-maharastra-government-likely-announce-today/articleshow/82173794.cms

No comments