Breaking News

విడాకులు తీసుకుంటే భారత పౌరసత్వం రద్దు.. ఓఐసీపై కేంద్రం కీలక ప్రకటన


భారతీయులను వివాహమాడిన విదేశీయులకు భారత పౌరసత్వం విషయమై కేంద్రం మరోసారి స్పష్టతనిచ్చింది. ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) పొందిన విదేశీయులు.. విడాకులు తీసుకుంటే ఆ హోదా రద్దవుతుందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. భారతీయ పౌరుడిని వివాహం చేసుకున్న ఓ బెల్జియం మహిళ కొన్నాళ్ల కిందట భర్త నుంచి విడాకులు తీసుకుంది. దీంతో ఓసీఐ కార్డును తిరిగి ఇచ్చేయాలని భారత్ కోరాగా.. ఇందుకు ఆమె నిరాకరించింది. అంతేకాదు, దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. భారత పౌరసత్వ చట్టం - సెక్షన్‌ 7డి (ఎఫ్) ప్రకారం.. భారతీయులను వివాహమాడిన విదేశీయులు విడాకుల తర్వాత ఓసీఐ హోదాను కోల్పోతారు. లేదా అర్హతలేని విదేశీయుల ఓసీఐ కార్డు రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ బెల్జియం మహిళ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా కేంద్ర హోంశాఖకు నోటీసులు జారీచేసిన .. వివరణలతో కూడిన అఫిడ్‌విట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఓసీఐ కార్డు ఉన్నవారు విడాకులు తీసుకుంటే భారత పౌరసత్వ హోదా రద్దు అవుతుందని చట్టంలో స్పష్టంగా ఉందని పేర్కొంటూ కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది. భారత పౌరుడిని వివాహం చేసుకున్న బెల్జియం మహిళలకు అక్కడ భారత రాయబార కార్యాలయం ఆమెకు 2006 అగస్టు 21న పర్సన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌ కార్డు (పీఐఓ)ను జారీ చేసింది. అనంతరం 2011 అక్టోబరులో అతడి నుంచి విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత ఆమెకు జారీ చేసిన పీఐఓ కార్డు రద్దు కావాల్సి ఉన్నప్పటికీ..ఆ సమయంలో అది రద్దు కాలేదు. అంతేకాదు, 2017లో ఆమెకు అనుకోకుండా ఓసీఐ కార్డు జారీ అయినట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఇప్పటికీ ఆమెకు జారీ చేసిన ఓసీఐ కార్డు రద్దు కాలేదనీ, దాన్ని తిరిగి అప్పగించని పక్షంలో చట్ట ప్రకారం కార్డు రద్దు చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఇలాంటి విదేశీయులు భారత్‌లో ఉండేందుకు ఇప్పటికే ఉన్న చట్టాల ప్రకారం వీసాకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. తన ఓసీఐ కార్డును అప్పగించమని కోరడానికి చట్టంలో ఎటువంటి ఆధారం లేదని, 2017 ఫిబ్రవరి 15 న తాను ఈ కార్డును స్వీకరించేటప్పటికే విడాకులు తీసుకున్నాననే కారణం సహేతుకంగా లేదని ఆ మహిళ వాదించింది. అంతేకాదు, తనతో విడాకులు తీసుకున్న విషయాన్ని బెల్జియంలోని భారత రాయబార కార్యాలయానికి తన మాజీ భర్త 2016లో సమాచారం ఇచ్చారని పేర్కొంది. అంతేకాదు, భారత పౌరులను వివాహమాడిన విదేశీయులు.. విడాకులు తీసుకుంటే ఓసీఐ కార్డును కోల్పోతారనే నిబంధన దరఖాస్తులో లేదని తెలిపింది. తనకు జారీచేసిన పీఐఓ కార్డు కాల పరిమితి 2021 ఆగస్టు వరకు ఉందని వివరించింది. నాకు ఓ కుమార్తె ఉందని, కరోనా కారణంగా విదేశీ యాత్రికులు భారత్‌కు రావడం వీలుపడటం లేదని, ఇక్కడ బంధువులను కలుసుకోడానికి కేవలం ఓసీఐ మాత్రమే అవకాశం కల్పిస్తుందని వాదించింది.


By April 10, 2021 at 11:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/foreigners-married-to-indians-cannot-enjoy-oci-status-after-divorce-centre-tells-hc/articleshow/82001398.cms

No comments